నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అడిగిన వరాలు ఇచ్చే కల్పవల్లిగా ప్రసిద్ధి కెక్కిన బుగ్గకాలువ బోయకొండ గంగమ్మ జాతర తొలి పూజలో పాల్గొనడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని మదనపల్లె వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్ పేర్కొన్నారు. బుగ్గకాలువ బోయకొండ గంగమ్మ జాతర సందర్భంగా మంగళవారం నిర్వహించిన పూజా కార్యక్రమానికి మదనపల్లె వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ వారు నిస్సార్ అహమ్మద్ కు పూలమాలలు వేసి దుశ్శాలువతో సన్మానించారు. అమ్మవారికి ఉదయం అభిషేకాల, పూజాది కార్యక్రమాలు నిర్వహించగా నిస్సార్ అహమ్మద్ పాల్గొని అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. పూజ కార్యక్రమాల అనంతరం నిస్సార్ అహమ్మద్ మాట్లాడుతూ కోరిన భక్తుల కోర్కెలు తీర్చే కల్పవల్లిగా బుగ్గకాలువ గంగమ్మ ప్రసిద్ధి కెక్కిందన్నారు. నిత్యం భక్తుల పూజలు అందుకునే గంగమ్మకు ప్రతి సంవత్సరం వైభవంగా జారత నిర్వహించడం ఆనవాయితీ అన్నారు. మదనపల్లె పట్టణ ప్రజానీకం గంగమ్మకు నిత్యం పూజలు చేసి భక్తి శ్రద్ధలతో కొలుస్తారని, మదనపల్లె ప్రజలు ఏదైనా శుభకార్యాలు తలపెట్టిన సమయంలో గంగమ్మను దర్శించుకుని వెళ్తే ఆ పని కోరిన విధంగా జరుగుతుందని ఇక్కడి ప్రజల నమ్మకం అన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారు, భూత ప్రేత భయంతో బాధపడే వారు ఇక్కడ పూజలు చేస్తే అన్ని బాధలు తగ్గి సంతోషంగా వుంటారనే నమ్మకం ఈ ప్రాంత ప్రజలలో వుందని వెల్లడించారు. జాతర సందర్భంగా మదనపల్లె చూట్టూ పక్కల ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటారు. నిస్సార్ అహమ్మద్ తోపాటు అన్నమయ్య జిల్లా వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ కరీముల్లా, హరి, లక్ష్మీదేవి, యూనస్, పవన్ తేజ, రవితేజ, వేణుగోపాల్ రెడ్డి, మహేష్, మల్లికార్జున రెడ్డి, శారద, నాగమణి నర్సింహులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అమ్మవారిని దర్శించుకుని తీర్ధప్రసాదాలు స్వీకరించారు.
Reporter
Namitha News