నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఏప్రిల్ 08 : మదనపల్లి ముఖ్య కేంద్రం గా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న హెల్పింగ్ మైండ్స్.హెల్పింగ్ మైండ్స్ 12వ వార్షికోత్సవం లో భాగంగా సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల కలికిరి నందు శానిటరీ ప్యాడ్ బ్యాంక్ ఆవిష్కరించారు. రుతుక్రమ సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు ఆరోగ్య సూత్రాలు తెలియాజేస్తూ హెల్పింగ్ మైండ్స్ బృందం విద్యార్థినులకు అవగాహన కల్పించారు .కళాశాల ప్రిన్సిపాల్ డా.అంజలీదేవి మాట్లాడుతూ విద్యార్థినుల కోసం ప్యాడ్ బ్యాంక్ అందుబాటులోకి తెచ్చిన హెల్పింగ్ మైండ్స్ బృందానికి కృతజ్ఞతలు తెలుపుతూ ,హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబక్కర్ సిద్దిక్ ,ఆయన ధర్మపత్ని ఆర్షియాను దుశ్శాలువ కప్పి,మొమెంటో తో సన్మానించారు. ఎన్ఎస్ఎస్ పిఓ డా.గులాబ్ జాన్ మాట్లాడుతూ చిన్న వయసులోనే సేవా కార్యక్రమాలు చేస్తూ అందరి మన్ననలు పొందుతున్న హెల్పింగ్ మైండ్స్ సేవలు ఆదర్శమని పేర్కొన్నారు. కార్యక్రమంలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాల కలికిరి ప్రిన్సిపాల్ డా.ఎల్.అంజలి దేవి, ఎన్. ఎస్. ఎస్. పి ఓ డా.ఎస్. గులాబ్ జాన్,అధ్యాపకులు కె.మాధవి,స్వర్ణ లత,రామ కృష్ణ,ఉదయ,లిఖిత,జి.మాధవి,హజీరా,శైలజ,కీర్తి, హెల్పింగ్ మైండ్స్ సభ్యులు సునీల్,కిరణ్,చైతు,సాంబ చరణ్,రాబియా అంజూమ్ పాల్గొన్నారు
Admin
Namitha News