Thursday, 16 April 2026 04:28:59 PM
# మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష # జాతీయ అగ్నిమాపక సేవల వారోత్సవాలు-2026 పోస్టర్ ను ఆవిష్కరణ చేసిన శ్రీరాం చినబాబు # సీపీఐ కార్యాలయంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135 వ జయంతి # డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ ఘన నివాళులు అర్పించిన ఎంపీడీఓ గంగయ్య

సత్యం,అహింస, సమానత్వం జాతిపిత మహాత్మాగాంధీ చూపిన మార్గం ఎప్పటికీ శాశ్వతం అని మదనపల్లె వైసిపి సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్

Date : 03 October 2025 11:34 AM Views : 93

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : సత్యం,అహింస, సమానత్వం జాతిపిత మహాత్మాగాంధీ చూపిన మార్గం ఎప్పటికీ శాశ్వతం అని మదనపల్లె వైసిపి సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్ పేర్కొన్నారు. ‌నిస్సార్ అహమ్మద్ ఆద్వర్యంలో గురువారం మహాత్మా గాంధీ జయంతిని వైసిపి కార్యాలయంలో 156 వ జయంతి ఘనంగా నిర్వహించారు. ‌జాతిపితకు జయంతి సందర్భంగా వైసిపి నాయకులు, కార్యకర్తలు ఘననివాళులు అర్పించారు. ‌ఈ సందర్భంగా నిస్సార్ అహమ్మద్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ చూపిన అహింస మార్గం ఆదర్శనీయం, అనుసరనీయం అని వివరించారు. ‌ఆయన ఎంచుకున్న మార్గంలో పయనించి దేశంలో పెచ్చురిల్లిన అవినీతి, అంతర్గత విభేదాలు, కుల, మత తత్వాలను అంత మోందించాలని పిలుపునిచ్చారు. ‌దేశ స్వాతంత్ర్య సముపార్జనలో ముందుండి దేశాన్ని నడిపించిన జాతిపిత మహాత్మా గాంధీ అన్నారు.‌ భరత జాతిని ఏకతాటిపై నడిపించి బ్రిటీష్ సామ్రాజ్యంపై శాంతి, అహింసలతో పోరాడి దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన మహనీయులు గాంధీజీ, ఆ మహాత్ముడు చూపిన బాట, ఆయన ఆచరించిన విలువలు యువతరానికి ఆదర్శం కావాలని, అప్పుడే మనం కలలు కంటున్న నవ భారత దేశం సాకారం అవుతుందని వివరించారు. ‌ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ మనుజా రెడ్డి, వైసిపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు షమీమ్ అస్లాం, కొత్తపల్లి మహేష్, చరణ్, చిన్న, ఇర్ఫాన్, మల్లికార్జున, అమ్మజాన్, నాగమణి, వినుతా భాయ్, శారద రెడ్డి, ఈశ్వర్ నాయక్, గ్రానైట్ మహేష్, యూనిస్, నూర్ మోదిన్, అబ్దుల్, ఎం.నవాజ్, యాసిన్, షాన్‌వాజ్, తాజ్ బాషా పెద్ద సంఖ్యలో వైసిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :