నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అజ్ఞానమనే చీకటిని తొలగించి, ఙ్ఞానమనే జ్యోతిని వెలిగించేవారే గురువు -- గురు పౌర్ణమి సందర్భంగా నిస్సార్ అహమ్మద్ వెల్లడి -- అమచెరువుమిట్ట శేషాచల నగర్ షిర్డీ సాయిబాబా ఆలయంలో నిస్సార్ అహమ్మద్ ప్రత్యేక పూజలు మానవ జీవిత చరితార్థానికి, భగవదర్శనానికి బాటలు వేసే వారే గురువులు, గురువుని త్రిమూర్తి స్వరూపంగా భావిస్తామని మదనపల్లె వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్ పేర్కొన్నారు. గురుపూర్ణిమ, ఆషాడ పూర్ణిమ, వ్యాసపూర్ణిమ, ఇలా ఏ పేరుతో పిలుచుకున్నా ఈ రోజు ఎంతో పవిత్రమైనదని గురు పౌర్ణమి సందర్భంగా మదనపల్లె శేషాచల నగర్ షిర్డీ సాయిబాబా ఆలయంలో నిర్వహించిన పూజ కార్యక్రమంలో నిస్సార్ అహమ్మద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్దానిక నాయకులు ఆలయం వద్ద ఘనంగా స్వాగతం పలికారు. దర్శన ఎర్పాట్లు తోపాటు ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా గురువు విశిష్టతను నిస్సార్ అహమ్మద్ వివరించారు. గురువులకు గురువుగా ఖ్యాతి గడించిన మహనీయుడు వ్యాసమహర్షి అని, ఆషాఢ పూర్ణిమను గురు పూజతో ఉత్సవం చేయటం భారతీయ సంస్కృతిలో భాగమైందని వెల్లడించారు. అజ్ఞానమనే చీకటిని తొలగించి, ఙ్ఞానమనే జ్యోతిని వెలిగించేవారే గురువు, మనం జన్మించిన తరువాత మన కన్న తల్లిదండ్రులు ప్రథమ గురువులు కాగా, మిగిలిన జీవితం మొత్తం మార్గనిర్దేశనం చేసేవారే గురువు అని, సమస్త ప్రకృతిలో నిండి జానాన్ని, ప్రేమను పంచటానికి గురువులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారని, ఆ మహత్తర ఙ్ఞానాన్ని అందుకోవటానికి శిష్యులకు చిత్తశుద్ధి అవసరం అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ శివారెడ్డి, అనిల్ కుమార్ రెడ్డి, బయ రెడ్డి, మధు , కృష్ణారెడ్డి, విశ్వనాథరెడ్డి, వెంకట్ రెడ్డి, శ్రీనివాసులు, ఆనంద, వేణుగోపాల్ రెడ్డి, శ్రీకాంత్, యూనస్, అబ్దుల్లా, జబివుల్లా, సాదిక్ పాల్గొన్నారు..
Reporter
Namitha News