నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె అక్టోబర్ 11 : తంబళ్లపల్లె మండల కేంద్రానికి సమీపంలోని మల్లయ్య కొండలో దసరా మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం భ్రమరాంబికా దేవి సిక్కిదాయని అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చింది. ఉదయం పెద్దమండెం మండలం గుర్రం వాండ్లపల్లె శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి కళా మండలి గిరిజన విభాగం జిల్లా అధ్యక్షుడు సుబ్బయ్య నాయక్, శ్యామలమ్మ దంపతులు భ్రమరాంబికా దేవిని సిక్కి దాయనిఅలంకరణకు సహకారం అందించారు. ఆలయ అర్చకులు ఈశ్వరప్ప స్వామి అమ్మవారికి ప్రత్యేక పుష్పాలంకరణ, ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు, ధూప దీప నైవేద్యాలు, కర్పూర హారతులు సమర్పించారు. శుక్రవారం మల్లయ్య కొండ ఆలయానికి వందలాదిగా మహిళా భక్తులు హాజరై అమ్మవారి సిక్కిదాయిని అవతారాన్ని కనులారా వీక్షించి తరించారు. రాత్రి ఆలయంలో శివనామ సంకీర్తన, అమ్మవారి కీర్తనలు, భజన కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించారు.
Admin
Namitha News