నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - ఆగస్ట్ 22 : రామసముద్రం మండలకేంద్రంలో ని బిసి కాలనీ వద్ద వెలిసిన దుర్గలమ్మ ఆలయం నందు ఆఖరి శ్రావణ శుక్రవారం మరవరలక్ష్మి పర్వదినం రోజున భక్తులు ఘనంగాపూజలు నిర్వహించారు.ఆలయప్రాంగణంలో మామిడి, వేపాకుతో తోరణాలు కట్టి ముస్తాబు చేశారు. దుర్గలమ్మకు పలురకాల పుష్పాలు, నిమ్మకాయల హారం,వేపాకుతో అలంకరణ చేశారు. పూజారి అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు అర్చనలు నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించారు . అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజలు చేసి అమ్మ వారికి పొంగల్ నైవేద్యం పెట్టి మొక్కులు చెల్లించుకున్నారు.ఆలయ పూజారి భక్తులకు అమ్మ వారి దర్శనం కల్పించి తీర్థప్రసాదాలు అందజేశారు.
Admin
Namitha News