నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె పట్టణానికి చెందిన మార్పూరి వెంకటేష్వర్లు అలియాస్ మార్పూరి వెంకటేష్ నాయుడు కోనేటి సులోచన వద్ద డబ్బులు తీసుకుని రిజిస్టర్ చేసి ఇచ్చిన ఆస్తిని తాను సంతకాలు చెయ్యకనే ఫోర్జరీ సంతకాలతో పాకాల, పులివెందుల సబ్ రిజిస్ట్రార్ లు కోనేటి సులోచనకు రిజిస్టర్ చేసి ఇచ్చారని తప్పుడు కేసులు బనాయించారు. అయితే వెంకటేష్ నాయుడు తప్పుడు కేసులు పెట్టినట్లు రుజువు కావడంతో అతనిపై కేసులు నమోదు అయ్యాయని సులోచన పాత్రికేయుల సమావేశం లో తెలిపింది. ఈ సందర్బంగా సులోచన మాట్లాడుతూ మార్పూరి వెంకటేష్ నాయుడుకు తాను డబ్బులు చెల్లించిన తర్వాత పాకాల రిజిస్ట్రార్ ఆఫీసులో కొంత ఆస్తిని రిజిస్టర్ చేసి ఇచ్చాడని, అదే విధంగా పులివెందుల సబ్ రిజిస్టర్ కార్యాలయంలో మరి కొంత ఆస్తిని తన పేరిట రిజిస్టర్ చేసి ఇచ్చాడని సులోచన తెలిపింది. అనంతరం భూముల ధరలు పెరగటంతో అత్యాశకు పోయి రిజిస్టర్ చేసి ఇచ్చిన ఆస్తిని మార్పూరి వెంకటేష్ అసలు సంతకమే పెట్టలేదని, వేలి ముద్రలు కూడా తనవి కాదని ఫోర్జరీ సంతకాలతో తన ఆస్తిని కోనేటి సులోచన కొట్టేసిందని వెంకటేశ్వర్లు ఆరోపిస్తూ పాకాల, పులివెందుల సబ్ రిజిస్ట్రార్ల పైన సులోచనపైన కేసులు పెట్టాడని సులోచన తెలిపింది. దీంతో తనతో పాటూ ఇరువురు సబ్ రిజిస్ట్రార్ల పై తిరుపతి జిల్లా రిజిస్ట్రార్, కడప జిల్లా రిజిస్ట్రార్, రాష్ట్ర అత్యున్నత స్టాంపులు మరియూ రిజిస్ట్రేషన్ల ఐజి లోతుగా దర్యప్తు చేసి వెంకటేశ్వర్లు తప్పుడు ఫిర్యాదు చేశాడని ఫింగర్ ప్రింట్లు, సంతకం మార్పూరి వెంకటేష్ నాయుడుదే అని తేల్చారన్నారు. ప్రభుత్వ అధికారులపై తప్పుడు కేసులు పెట్టిన వెంకటేష్ పై క్రిమినల్ కేసులకు అధికారులు ఆదేశించారు. అనవసరంగా తమపై కేసు పెట్టిన మార్పూరి వెంకటేష్ నాయుడుపై పాకాల సబ్ రిజిస్ట్రార్ రహీముల్లా, పులివెందుల సబ్ రిజిస్ట్రార్ చంద్ర మోహన్ లు వేర్వేరుగా ఫిర్యాదు చేశారు.ఈ మేరకు మార్పూరి వెంకటేష్ నాయుడు పై పాకాల పోలీస్ స్టేషన్లో అక్టోబర్ 16 వ తేదీన ఎఫ్ఐఆర్ నంబర్: 175/2024 గా, పులివెందుల పోలీస్ స్టేషన్లో డిసెంబర్ 2వ తారీఖున ఎఫ్ఐఆర్ నంబరు 432/2024 గా వేర్వేరుగా కేసులు నమోదు చేసారని సులోచన తెలిపింది. అనవసరంగా తనపై కేసులు పెట్టి తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని, ప్రసార మాధ్యమాల ద్వారా దుశ్ప్రచారం చేసి తన పరువుకి భంగం కలిగించారు కాబట్టి మార్పూరి వెంకటేష్ నాయుడు, పార్వతమ్మ, వెంకట్రమణా రెడ్డి, రెడ్డి గోపాల్ నాయుడు, సునిత ల మీద హైకోర్టులో రిట్ పిటీషన్ వేయనున్నట్లు తెలిపింది.
Admin
Namitha News