నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పెద్దమండ్యం - ఏప్రిల్ 13 : పెద్దమండ్యం మండలం కలిచెర్ల గ్రామం సమీపంలోని పాపిరెడ్డి చెర్వు లో ఈత కొట్టుతూ విద్యార్థి మృతి చెందాడని సమాచారం తో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పెద్దమండ్యం పోలీసులు . స్థానికుల సహాయం తో మృతదేహాన్ని వెలికితీయగా మృతుడు భాస్కర్ రెడ్డి 17 సం గా గుర్తింపు . మృతి చెందిన విద్యార్థి బి.కొత్తకోట మండలం బండమీద పల్లె కు చెందిన రెడ్డెప్ప రెడ్డి కుమారుడు . నిన్నటి దినం కలిచెర్ల లో నున్న స్నేహితుడు రాజశేఖర్ రెడ్డి ఇంటికి వచ్చి నేడు స్నేహితులతో కలిసి సమీపంలోని చెర్వు లో ఈత కు వెళ్లి మధ్యలో నీటమునిగి మృతి చెందడం తో కలిచెర్ల గ్రామం , బండమీద పల్లి లోనూ విషాదఛాయలు . శవ పంచనామా అనంతరం మృతదేహాన్ని పోస్టు మోర్ట్యూమ్ నిమిత్తం మదనపల్లి సర్వజన ఆసుపత్రికి తరలింపు
Admin
Namitha News