Thursday, 16 April 2026 06:08:07 PM
# వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష # జాతీయ అగ్నిమాపక సేవల వారోత్సవాలు-2026 పోస్టర్ ను ఆవిష్కరణ చేసిన శ్రీరాం చినబాబు

కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయండి

Date : 29 August 2025 05:16 PM Views : 190

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయండి - డాక్టర్ ఎస్.కే.బాషాకు ఏపీసీసీ చీఫ్ వై.ఎస్.షర్మిల సూచనలు మదనపల్లె : కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ మైనార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ ఎస్.కే.బాషాకు ఏపీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్ షర్మిల సూచించారు.గురువారం విజయవాడలోని గాంధీ భవన్ నందు ఏపీ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగం సమావేశం జరిగింది.ఈ సమావేశానికి డాక్టర్ ఎస్.కే.బాషా హాజరయ్యారు.అదేవిధంగా శుక్రవారం వై.ఎస్ షర్మిల,ఏపీ కాంగ్రెస్ మైనార్టీ వ్యవహారాల ఇంచార్జ్ డెస్టాన్ రాజా,వైస్ ఇంచార్జి జావీద్ ముల్లా,మైనార్టీ విభాగం అధ్యక్షులు దాదాగాంధీలను గుర్రంకొండ మండల మాజీ అధ్యక్షుడు సమీరుద్దీనుతోపాటు మర్యాదపూర్వకంగా కలిశారు.ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మదనపల్లి నియోజకవర్గంలో తాము చేపట్టిన కార్యక్రమాలను డాక్టర్ ఎస్.కే.బాషా షర్మిలకు వివరించగా ప్రత్యేకంగా ప్రశంసించారన్నారు.ఈ సందర్భంగా డాక్టర్ ఎస్.కే.బాషా మాట్లాడుతూ మదనపల్లి నియోజకవర్గంలో పార్టీ పటిష్టతపై దృష్టి సారించాలని,మైనార్టీలను ఏకతాటిపై నడిపేందుకు చర్యలు చేపట్టాలని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు.అంతర్గత విభేదాలతో నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఇబ్బందికరంగా మారిందని,కావున ఇక్కడ పరిస్థితులను చక్కబరచాలన్నారు.దీనిపై షర్మిల స్పందిస్తూ సిడబ్ల్యుసి సభ్యుడు మస్తాన్ వలికి మదనపల్లె నియోజకవర్గంలో పరిస్థితులను చక్కపెట్టాలని ఆదేశించారు.దీంతో వచ్చే నెల సెప్టెంబర్ 20వ తేదీపైన అన్నమయ్య జిల్లా మరియు మదనపల్లి నియోజకవర్గంలో మస్తాన్ వలి పర్యటిస్తారని డాక్టర్ ఎస్.కే బాషా తెలిపారు.రాష్ట్ర మైనార్టీ విభాగం సమావేశం చాలా అద్భుతంగా జరిగిందని,పార్టీ మైనార్టీ విభాగం బలోపేతానికి ప్రముఖులు అందించిన సూచనలు,సలహాలు ఎంతగానో దోహదపడతాయన్నారు.త్వరలోనే మదనపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పూర్వవైభవం సంతరించుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :