Thursday, 16 April 2026 06:15:27 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

నేడు నామినేషన్ వేయనున్న కిరణ్ కుమార్ రెడ్డి కార్యక్రమానికి తరలిరండి - నల్లారి నిరూప్

Date : 24 April 2024 07:11 AM Views : 214

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె ఏప్రిల్ 23 : బుధవారం అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి కలెక్టరేట్లో రాజంపేట ఎంపీ అభ్యర్థిగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరుకావాలని బిజెపి నాయకుడు నల్లారి నిరూప్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం తంబళ్లపల్లె లో జరిగిన ఎన్ డి ఏ తెలుగుదేశం, జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తలు సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజంపేట పార్లమెంటు నియోజకవర్గం లో గత వైకాపా పాలనలో ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని పెద్దిరెడ్డి కుటుంబం అభివృద్ధి చేయకపోగా అరాచకాలు, దౌర్జన్యాలు, భూ కబ్జాలు, మైనింగ్ మాఫియా, ఇసుక మాఫియా, అక్రమ కేసులు బనాయింపు, సహజ వనరుల దోపిడీ తో తంబళ్లపల్లె ను నిలువు దోపిడి చేశారని ఆరోపించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థులు ఎంపీగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేగా దాసరిపల్లి జై చంద్రారెడ్డి గెలుపు కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గతంలో ముఖ్యమంత్రిగా తంబళ్లపల్లి నియోజకవర్గానికి ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు. బుధవారం రాయచోటిలో జరిగే ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి తంబళ్లపల్లె మండలం నుండి పెద్ద ఎత్తున ఎన్డీఏ లోని మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు క్లస్టర్ ఇంచార్జ్ బేరి శ్రీనివాసులు, మాజీ ఎంపీటీసీ చలపతి నాయుడు, తెలుగు యువత నియోజకవర్గ ఉపాధ్యక్షుడు నరసింహులు, సోమశేఖర్, మ్యూజికల్ శివ, సుబ్రహ్మణ్యం, జనసేన నాయకులు మురళి, హరీష్, బిజెపి నాయకులు గోపాల్ రెడ్డి, మగ్గాలు లక్ష్మయ్య, గాండ్ల సుబ్బయ్య కార్యకర్తలు పాల్గొన్నారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :