నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె ఆగస్టు 20 ః తంబళ్లపల్లె మండలం లో గతంలో వెలుగు ద్వారా అభయ హస్తం పెన్షన్ పొంది వివిధ కారణాలతో ఆగిపోయిన అర్హులైన లబ్ధిదారులు తిరిగి రీజాబ్ చేసుకునే అవకాశం ఉందని డిపిఎం ధర్మరాజు సూచించారు. మంగళవారం ఎంపీడీవో కార్యాలయంలో ఏపిఎం గంగాధర్ ఆధ్వర్యంలో సంఘమిత్రలు, వివో సభ్యులతో అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా డిపిఎం మాట్లాడుతూ మండలంలో వృద్ధాప్య, వితంతు, దివ్యాంగులు, పలు రకాల వ్యాధిగ్రస్తులకు 23 రకాల పెన్షన్లు మంజూరు అవుతున్నట్లు చెప్పారు. గతంలో అభయహస్తం ద్వారా పెన్షన్లు ఆగిపోయిన లబ్ధిదారులు తిరిగి రోల్ బ్లాక్ చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా పెరాల్సిస్, కండరాల వ్యాధి తో బాధపడే వారు నేడు 10,000 వరకు పెన్షన్ పొందే అవకాశం ఉందన్నారు. మహిళా సంఘాలు అభయహస్తం అర్హులైన లబ్ధిదారులకు అవగాహన కల్పించి వారికి లబ్ధి పొందే అవకాశం కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల సమాఖ్య అధ్యక్షురాలు రామ లక్ష్మమ్మ, సిసిలు ఆదిలక్ష్మి భద్రయ్య, అంశీరాబేగం, సంఘమిత్రలు, వివో సభ్యులు, మహిళా సంఘ సమాఖ్య సభ్యులు పాల్గొన్నారు.
Admin
Namitha News