నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : జిల్లా కేంద్రం ఏర్పాటుతో మారనున్న మదనపల్లె రూపురేఖలు - పారిశ్రామిక అభివృద్ధితోపాటు ఉపాధి అవకాశాలు మెరుగు - జనసేన పార్టీ జిల్లా నాయకులు రాయల్ గణి హర్షం మదనపల్లె : త్వరలో జిల్లా కేంద్రం కానున్న నేపథ్యంలో మదనపల్లె రూపురేఖలు మారనున్నాయని ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన పార్టీ నాయకులు రాయల్ గణి పేర్కొన్నారు.సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లడుతూ గత వైసిపి నాయకుల స్వార్థం కోసం మదనపల్లెను జిల్లా కాకుండా చేశారన్నారు.ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మదనపల్లి జిల్లా ఏర్పాటుకు సుముఖతకు తెలుపడం శుభసూచకమన్నారు.అసెంబ్లీ సమావేశాల్లో స్థానిక ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ మదనపల్లె జిల్లా అంశాన్ని ప్రస్తావించి శభాష్ అనిపించుకున్నారన్నారు.అటు బెంగళూరు,ఇటు చైన్నై మహా నగరాలకు మదనపల్లి సమీపంలో ఉండడంతో పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి సానుకూల అంశమన్నారు.పరిశ్రమలు వస్తే నిరుద్యోగులకు పుష్కలంగా ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయన్నారు.మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేతకానితనంతో కడప - రాయచోటి - బెంగళూరు రైల్వే వెనక్కి వెళ్లిపోయిందన్నారు.తిరిగి కూటమి ప్రభుత్వం ప్రస్తుతం కడప - మదనపల్లె - బెంగళూరు రైల్వే లైను నిర్మాణానికి సానుకూలంగా ఉందని,అదేవిధంగా ఒక విమానాశ్రయం నిర్మాణానికి సైతం ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.కావున జిల్లా ఏర్పాటు అయితే మదనపల్లి పరిసర ప్రాంతాల్లో భూముల విలువలు పెరిగడమే,ఇక్కడ ప్రాంత ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేరుతుందన్నారు.మదనపల్లె జిల్లా ఏర్పాటుకు సహకరిస్తున్న సీఎం చంద్రబాబు,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్,కూటమి నాయకులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర,చక్రి తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News