Thursday, 16 April 2026 06:08:06 PM
# వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష # జాతీయ అగ్నిమాపక సేవల వారోత్సవాలు-2026 పోస్టర్ ను ఆవిష్కరణ చేసిన శ్రీరాం చినబాబు

బాధ్యతతో హెల్మెట్ ధరించి...సురక్షితంగా మీ గమ్యాలను చేరుకొండి!

మీ కుటుంబానికి మీరే రక్ష !హెల్మెట్ మీకు శ్రీరామరక్ష ! అర్బన్ సి ఐ చంద్ర శేఖర్,ట్రాఫిక్ సి ఐ విశ్వనాధ రెడ్డి!

Date : 19 December 2024 02:58 PM Views : 325

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాయచోటి నమిత న్యూస్ డిసెంబర్ 19:- రాయచోటి పట్టణంలో హెల్మెట్ వాడకం పై అవగాహనా ర్యాలి ఉదయం 10:30 గంటలకు సంజీవ్ నగర్ కాలనీ చెక్పోస్ట్ శివాలయం వద్ద నుంచి మాసాపేట సాయి ఇంజనీరింగ్ కాలేజ్ వరకు ర్యాలీ నిర్వహించినట్లు ట్రాఫిక్ సి ఐ విశ్వనాధ్ రెడ్డి గురువారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెల్మెట్ ను బరువుతో కాకుండా బాధ్యతతో దరించి సురక్షితంగా ప్రయాణించాలని వాహనదరులను కోరారు. ట్రాఫిక్ సి ఐ విశ్వనాధ రెడ్డి,అర్బన్ సి ఐ చంద్ర శేఖర్ లు.అన్నమయ్య జిల్లా ఎస్పి విద్యాసాగర్ నాయుడు ఆదేశాలు మేరకు రాయచోటి డివిజన్ డిఎస్పి కృష్ణ మోహన్ నేతృత్వంలో పట్టణంలో హెల్మెట్ వాడకం పై బైక్ ర్యాలి కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ ర్యాలీని అర్బన్ సి ఐ చంద్ర శేఖర్ జెండా ఉపి ప్రారంబించారు.స్థానిక శివాలయం నుండి ఎస్ యాన్ కాలని,నేతాజీ కూడలి,బస్టాండ్ సర్కిల్ ,నాలుగు రోడ్ల సర్కిల్ మీదగా కలెక్టర్ కార్యాలయం వరకు ఈ ర్యాలిని కొనసాగించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రోడ్డు ద్విచక్రవహనం నడిపే ప్రతి ఒక్కరు కుడా హెల్మెట్ వాడకాన్ని అలవాటు చేసుకోవాలన్నారు.లక్షలాది రూపాయలు వ్యయం చేసి బైక్ లు కొన్నవారు హెల్మెట్ వాడక పోవడం చాలా బాధాకరం అన్నారు. మొబైల్ వాడకం పట్ల ఉండే ప్రాదాన్యత ,మన ప్రాణానికి ఎందుకు ఇవ్వలేక్ పోతున్నారని వారు ప్రశ్నించారు.ప్రస్తుతం జరుగుతున్న ప్రమాదాలలో హెల్మెట్ లేక పోవడం వల్లనే అధికంగా మృత్యువాత పడుతున్నారని విచారాన్ని వ్యక్తం చేశారు.హెల్మెట్ లేని ప్రయాణం సురక్షితం కాదని తప్పని సరిగా హెల్మెట్ ధరించాలని లేని యెడల పొలిసు చర్యలు తప్పవని కూడా ఈ సందర్బంగా వారు హెచ్చరించారు.ఈ ర్యాలిలో లయన్స్ క్లబ్ అఫ్ రాయచోటి టౌన్ సభ్యులు,శ్రీ సాయి ఇంజేనేరింగ్ కలశాల యాజమాన్యం,విద్యార్థులు ప్రజలు,పొలిసు సిబ్బంది పాల్గొన్నారు.

Sri Hari B

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :