నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె ఆగస్టు 21 : తంబళ్లపల్లె మండలం లో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా ఉక్కు పాదం మోపాలని ఎస్సై లోకేష్ రెడ్డికి మొలకలచెరువు సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజా రమేష్ సూచించారు. బుధవారం ఆయన తంబళ్లపల్లి పోలీస్ స్టేషన్ను తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ రికార్డులు, పోలీసుల పనితీరు, నేరస్తుల వివరాల పై ఆరాతీసి సంతృప్తి వ్యక్తం చేశారు. మండలంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా మారుమూల గ్రామాలలో నాటు సారా తయారీ, కర్ణాటక అక్రమ మద్యం, ఇసుక అక్రమ రవాణా పై నిఘా పెంచాలన్నారు. అదేవిధంగా గ్రామాలలో సమస్యల పరిష్కారానికి సంబంధిత మహిళా పోలీసులు సహకారంతో కృషి చేయాలని సూచించారు. ఆయన వెంట ఎస్సై లోకేష్ రెడ్డితో పాటు పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
Admin
Namitha News