నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఎస్.రెడ్డీ సాహెబ్ నిర్విరామ కృషి -- కొనియాడిన కాంగ్రెస్ పార్టీ నాయకులు -- నాయకులు, కార్యకర్తలు, అభిమానుల మధ్య ఘనంగా పుట్టిన రోజు వేడుకలు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఎస్.రెడ్డి సాహెబ్ నిర్విరామ కృషి చేస్తున్నారని ఆ పార్టీ నాయకులు స్పష్టం చేశారు. పట్టణంలోని దొంతి వీధి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం రెడ్డి సాహెబ్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు శాలువా, గజమాలలతో ఆయనను ఘనంగా సత్కరించి, కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మీనా కుమారి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీనే తన ఊపిరిగా భావించి పార్టీ అభ్యున్నతి కోసం ఎస్.రెడ్డి సాహెబ్ ఎంతో కృషి చేస్తున్నారన్నారు. పార్టీ కార్యక్రమాలను చురుకుగా నిర్వహిస్తూ అధిష్టానం వద్ద తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారని కొనియాడారు. నిరంతరం కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి, కార్యకర్తల సంక్షేమం కోసం పనిచేస్తున్న ఎస్.రెడ్డి సాహెబ్ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, భవిష్యత్తులో ఉన్నత పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు. అనంతరం రెడ్డి సాహెబ్ మాట్లాడుతూ చిన్నతనం నుండి తనకి కాంగ్రెస్ పార్టీ అంటే అంతులేని అభిమానం అని, ఆ అభిమానమే తనను కాంగ్రెస్ పార్టీకి మరింత చేరువ చేసిందన్నారు. దేశ ప్రజల సంక్షేమం, శ్రేయస్సు కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని పేర్కొన్నారు. ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఏపీలో పటిష్టంగా తయారవుతోందన్నారు. ఇప్పటి నుండే ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేసే 2029లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసుకొని మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాన్ని నెరవేరుద్దామని ఆయన పిలుపునిచ్చారు. అదేవిధంగా తనపై ఎంతో అభిమానంతో పుట్టినరోజు వేడుకలకు విచ్చేసి శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాని, ఇదే అభిమానం మున్ముందు తనపై కొనసాగాలని కోరుకుంటున్నానన్నారు. ఈ కార్యక్రమంలో మీనా కుమారి, మహమ్మద్ షరీఫ్, ఖాదర్ బాషా, ముబారక్ ఖాన్, మహమ్మద్ రఫీ, ఈశ్వరమ్మ, శరత్ కుమార్ రెడ్డి, రవీంద్ర, మహబూబ్ పీర్, నాగరాజ, పాలేటి, మహమ్మద్ అలీ, బక్షు, ఖాసిం వలి, వసంతమ్మ, సోను, సయ్యద్, సాదిక్, సుహేల్, సాజిద్, యూనుస్, సాయి, చంద్ర, రాజు మరియు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
Reporter
Namitha News