నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె జనవరి 6 : తంబళ్లపల్లె నియోజకవర్గానికి ఆయువుపట్టుగా నిలిచిన పెద్దేరు ప్రాజెక్టు కాలువల అభివృద్ధి పనులకు కోటి రూపాయలు మంజూరు అయిందని పనులు శరవేగంగా జరుగుతున్నట్లు పెద్దేరు ప్రాజెక్టు ఆయకట్టు చైర్మన్ కొటాల శివకుమార్ తెలిపారు. సోమవారం ఆయన ప్రాజెక్ట్ ఆయకట్టులోని కుడి కాలువ కొత్తరెడ్డివారిపల్లె వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. కాలవలు పూడికతీత, పిచ్చి మొక్కల తొలగింపు, కాలువ ఇరువైపులా రోడ్లు, మరమ్మతు పనులు త్వరగా పూర్తి చేయడానికి కృషి చేస్తామన్నారు. పెద్దేరు ప్రాజెక్టు మరమ్మతులకు నిధులు మంజూరులో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు నిమ్మల రామానాయుడు, మండ్లిపల్లి రాంప్రసాద్ రెడ్డి, తంబళ్లపల్లి ఇంచార్జ్ దాసరపల్లి జయచంద్రారెడ్డి ల కృషి ఫలితమేనని కొనియాడారు. పెద్దేరు ప్రాజెక్టు పూర్తిస్థాయి అభివృద్ధి పనులు, మండలంలోని 10 చెరువుల అభివృద్ధి పనులకు సంబంధిత చెరువు సంఘం చైర్మన్ల నుండి నివేదికలతో నిధుల మంజూరుకు అందరి సహకారంతో కృషి చేస్తానని ధీమా వ్యక్తం చేశారు.
Reporter
Namitha News