Thursday, 16 April 2026 06:11:41 PM
# వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష # జాతీయ అగ్నిమాపక సేవల వారోత్సవాలు-2026 పోస్టర్ ను ఆవిష్కరణ చేసిన శ్రీరాం చినబాబు

పెద్దేరు కుడి కాలువ పనులను పరిశీలిస్తున్న చైర్మన్ కొటాల శివకుమార్.

కోటి రూ నిధులతో కొనసాగుతున్న పనులు

Date : 06 January 2025 08:02 PM Views : 314

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె జనవరి 6 : తంబళ్లపల్లె నియోజకవర్గానికి ఆయువుపట్టుగా నిలిచిన పెద్దేరు ప్రాజెక్టు కాలువల అభివృద్ధి పనులకు కోటి రూపాయలు మంజూరు అయిందని పనులు శరవేగంగా జరుగుతున్నట్లు పెద్దేరు ప్రాజెక్టు ఆయకట్టు చైర్మన్ కొటాల శివకుమార్ తెలిపారు. సోమవారం ఆయన ప్రాజెక్ట్ ఆయకట్టులోని కుడి కాలువ కొత్తరెడ్డివారిపల్లె వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. కాలవలు పూడికతీత, పిచ్చి మొక్కల తొలగింపు, కాలువ ఇరువైపులా రోడ్లు, మరమ్మతు పనులు త్వరగా పూర్తి చేయడానికి కృషి చేస్తామన్నారు. పెద్దేరు ప్రాజెక్టు మరమ్మతులకు నిధులు మంజూరులో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు నిమ్మల రామానాయుడు, మండ్లిపల్లి రాంప్రసాద్ రెడ్డి, తంబళ్లపల్లి ఇంచార్జ్ దాసరపల్లి జయచంద్రారెడ్డి ల కృషి ఫలితమేనని కొనియాడారు. పెద్దేరు ప్రాజెక్టు పూర్తిస్థాయి అభివృద్ధి పనులు, మండలంలోని 10 చెరువుల అభివృద్ధి పనులకు సంబంధిత చెరువు సంఘం చైర్మన్ల నుండి నివేదికలతో నిధుల మంజూరుకు అందరి సహకారంతో కృషి చేస్తానని ధీమా వ్యక్తం చేశారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :