నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : లక్కిరెడ్డిపల్లి జూలై 17 : ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడానికి కృషిచేసిన తెలుగుదేశం, జనసేన ,బిజెపి కార్యకర్తలకు కూటమి ప్రభుత్వం అండగా నిలిచి వారి సంక్షేమానికి కృషి చేయాలని తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి బాలిశెట్టి హరిప్రసాద్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండల జనసేన అధ్యక్షుడు నిమ్మనపల్లి పవన్ కుమార్, ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం అన్నమయ్య జిల్లా మీడియా ఇన్చార్జ్ కె వెంకటేశ్వర్లు, తెలుగుదేశం పార్టీ ప్రచార కార్యదర్శి యనమల విశ్వనాథ్, తెదేపా నాయకులు సైనాతం శివయ్య పాల్గొన్నారు
Admin
Namitha News