నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : కురబల కోట - అక్టోబర్ 23 : కురబలకోట మండలం కంటే వారి పల్లి నందు నున్న చింతపండు ప్రాసెస్సింగ్ పరిశ్రమను పరిశీలించిన తంబళ్లపల్లె నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ దాసరిపల్లి జయచంద్రా రెడ్డి . ఉమ్మడి చిత్తూరు జిల్లా చింతపండు ప్రాసెస్సింగ్ క్లస్టర్ యూనిట్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం . యూనిట్ ను పరిశీలించి అక్కడున్న చింతపండును ఉపయోగించి రసాయనాలను తీసే యంత్రాలను పరిశీలించి అవి ఏ విధంగా పనిచేస్తున్నాయి వాటిని ఉపయోగించుకొని ఏ విధముగా పని చేస్తూ లబ్ది చేకూరుతోందో అని అని అక్కడ ఉన్న సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పరిశ్రమలో ఉన్న ప్రతి ఒక్క యంత్రాన్ని పరిశీలించి మరియు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్తగా కొన్ని యంత్రాలను పరిశ్రమకు ఏర్పాటు చేశారని స్థానిక సిబ్బంది తెలియజేశారు. పరిశ్రమలో అవసరమైన సిబ్బంది లేకపోవడంతో ప్రస్తుతం పరిశ్రమను ఉపయోగించడం తాత్కారితంగా నిలిపివేశామని ప్రస్తుత సిబ్బంది తెలియజేశారు.పరిశ్రమ నుంచి చింతపండు రసం ద్వారా అన్ని రకాల వంట పదార్థాలు మరియు నిత్యావసరాలకు ఉపయోగపడే నాణ్యమైన పోడులు తయారు చేస్తున్నామని అవి నాణ్యమైన పదార్థాలుగా తయారుచేస్తున్నామని తెలియచేసిన కార్మికులు . రాష్ట్ర ప్రజలకు నాణ్యంగా , మీకు ఆదాయం సమకూరేలా పరిశ్రమను అభివృద్ధి చేసుకోవాలని తెలియచేశారు . పరిశ్రమకు కావాల్సిన సిబ్బందిని వెంటనే పీడీ తో మాట్లాడి ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చిన ఇంచార్జీ జయచంద్రా రెడ్డి . ఈ కార్యక్రమంలో దాసరిపల్లి జయచంద్ర రెడ్డి తో పాటు సమన్వయకర్త సీడ్ మల్లికార్జున నాయుడు , టిడిపి రాష్ట్ర బీసీ సెల్ అధికార ప్రతినిధి తులసీదర్ నాయుడు , మండల కన్వీనర్ సురేంద్ర , మండల రైతు అధ్యక్షులు రాజారెడ్డి , పూస మోహన్ రెడ్డి కంటే వారి పల్లి వెంకట శివ కన్నెమడుగు బాబు రాజారెడ్డి భాస్కర్ రెడ్డి వైజి సూరి తమ్మి చెట్ల సూరి వెంకట రమణారెడ్డి రాఘవరెడ్డి రుద్ర బాలకృష్ణ, మాజీ సర్పంచ్ ఎర్రగుడి సురేష్ చిటికె శివారెడ్డి డిబిఆర్ వెంకటరమణారెడ్డి సత్తి స్థానిక సిబ్బంది కూటమి నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
Reporter
Namitha News