నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : బి. కొత్తకోట - మార్చి 02 : వర్గ పోరాటాల సారథి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ శతవసంతాల వేడుకలను జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి పి.ఎల్. నరసింహులు ప్రజానీకానికి పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం 11 గంటలకు స్థానిక పీటీయం రోడ్డు నందు శతవసంతాల వేడుకలకు సంబంధించిన ప్రచార గోడప్రతులను విడుదల చేశారు. ఈ సందర్భంగా పి.ఎల్. నరసింహులు,జిల్లా కార్యవర్గ సభ్యులు టి. కృష్ణప్ప లు మాట్లాడుతూ 1925 సంవత్సరం డిసెంబర్ 26వ తేదీన భారత కమ్యూనిస్టు పార్టీ కాన్పూర్ పట్టణంలో పురుడు పోసుకున్నదని, సంపూర్ణ స్వాతంత్రం కోసం బ్రిటిష్ వారితో పోరాడి అనేక మంది కమ్యూనిస్టు బిడ్డలను ప్రాణత్యాగం చేసిన పార్టీ సిపిఐ పార్టీ అంటూ కొనియాడారు. దున్నేవానికి భూమి కావాలని, బలిసిన పరాన్నభుక్తులైన జమీందారీ వ్యతిరేక పోరాటాలు చేసి భూసంస్కరణల చట్టాన్ని సాధించిందని, తెలంగాణ సాయుధ పోరాటం చేసి 4 వేల మంది కార్యకర్తల వీరమరణంతో నైజాం దొరల చెరలోని 10 లక్షల ఎకరాల భూములను పేదలకు పంపిణీ చేసిందని అన్నారు.ఆనాటి నుంచి నేటి వరకు అనునిత్యం కష్టజీవుల పక్షాన నిలబడి పాలకుల విధానాలపై సమరశీల పోరాటాలు చేస్తున్న పార్టీ సిపిఐ అని అన్నారు.బి.కొత్తకోట పట్టణం మరియు మండల లోని అనేక ప్రజా సమస్యలపై సమరశీల పోరాటాలు చేసి విజయం సాధించిన పార్టీ సిపిఐ శతజయంతి ఉత్సవాలు బి.కొత్తకోట పట్టణంలో ఈ నెల తొమ్మిదవ తేదీ ఆదివారం ఘనంగా జరుగుతున్నాయని,ఈ వేడుకలకు జాతీయ కార్యదర్శి డాక్టర్ కే. నారాయణ,రాష్ట్ర కార్యదర్శి,మాజీ శాసనసభ్యులు కే. రామకృష్ణ,పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి.హరినాథ్ రెడ్డి,జి.ఈశ్వరయ్య లు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ.రామానాయుడు, ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి చిన్నం.పెంచలయ్య మరియు జిల్లా నాయకత్వం పాల్గొంటున్నారని, ఆదివారం ఉదయం జరిగే ర్యాలీ మరియు బహిరంగ సభలో ప్రజానాట్యమండలి బృందం వారిచే సాంస్కృతి క ప్రదర్శనలు,వివిధ జానపద కళారూపాలు పాల్గొంటున్నాయని అన్నారు.పార్టీ కార్యకర్తలు, శ్రామికులు,కర్షకులు, యువకులు,విద్యార్థులు, మహిళలు,సానుభూతిపరులు అందరూ కూడా ఈ ఉత్సవాలలో పాల్గొని జయప్రదం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో తంబళ్లపల్లె నియోజకవర్గపు కార్యదర్శి ఎస్.మనోహర్ రెడ్డి, సీనియర్ నాయకులు ఎస్. బషీర్ ఖాన్,మండల నాయకులు జీ.రఘునాథ్, ఎం.అష్రఫ్అల్లీ, షమీవుల్లా,గంగులప్ప,,శ్రీరాములు,నరసింహులు,సోమశేఖర్, బావాజాన్,కిట్టన్న తదితరులు పాల్గొన్నారు
Admin
Namitha News