నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె జనవరి 16 ః తంబళ్లపల్లె మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న ఎకనామిక్స్ లెక్చరర్ వి వెంకటరమణ (45) గుండెపోటుతో మృతి చెందాడు. తంబళ్లపల్లె ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 2008 నుండి వి వెంకటరమణ ఎకనామిక్స్ లెక్చరర్ గా పనిచేయడంతో పాటు విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన విద్య అందించడంతోపాటు కళాశాల అభివృద్ధి కోసం సహచర లెక్చరర్లు సలహాలు, సూచనలతో తన వంతు సహకారం అందించి అందరి మన్ననలు పొందడం విశేషం. సంక్రాంతి సెలవులలో వెంకటరమణ తన కుటుంబ సభ్యులతో తన స్వగ్రామం అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం ఎరుకల వారి పల్లెకు పండుగ కు తరలి వెళ్లారు. గత మూడు రోజులుగా సంక్రాంతి పండుగ తన కుటుంబ సభ్యులు, పిల్లలు, బంధువులు, స్నేహితులతో సంతోషంతో సరదాగా గడిపాడు. గురువారం ఉదయం చాతిలో నొప్పి రావడం తో హుటాహుటిన వెంకటరమణ ను మెరుగైన చికిత్స కోసం కడప ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో వెంకటరమణ మృతి చెందాడు. ఆయనకు భార్యతో పాటు నలుగురు పిల్లలు ఉన్నారు. వెంకటరమణ మృతి తో భార్య పిల్లలు,కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. వెంకటరమణ మృతి పై జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ అమరేంద్ర కుమార్, లెక్చరర్లు వెంకట్రాముడు, చంద్రశేఖర్, మాధవరెడ్డి, వెంకటరమణ, సురేష్, సుప్రజ, సునంద, ఉషారాణి, మోపూరి లు సంతాపం ప్రకటించారు.
Reporter
Namitha News