నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె ఏప్రిల్ 28 : తంబళ్లపల్లె నియోజకవర్గం లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో వృక్ష సంపద ఎలా వృద్ధి చెందుతుందో అలా ఓటర్లు పోలింగ్ శాతం పెంచడానికి సహకరించాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాఘవేంద్ర సూచించారు. ఆదివారం తంబళ్లపల్లె తాసిల్దార్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాఘవేంద్ర ఓటింగ్ మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు తమ విలువైన ఓటు హక్కును తమకు నచ్చిన సరైన నాయకుని ఎన్నుకొని ప్రజాస్వామ్యానికి జీవం పోయాలన్నారు. ఓటు హక్కు వినియోగం ద్వారా ప్రజాస్వామ్య ఫలాలు ప్రజలందరూ అనుభవించడానికి చక్కటి అవకాశం ఏర్పడుతుందని కాన ప్రతి ఒక్కరు ఓటింగ్ లో పాల్గొని పోలింగ్ శాతం పెంచడానికి సహకరించాలన్నారు. తంబళ్లపల్లి గత సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ శాతం 75% ఉందని ఈ మారు ఎన్నికల్లో ఇంకా ఎక్కువ శాతం ఓటింగ్ జరగడానికి లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఓటర్లకు పోలింగ్ కేంద్రాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి భద్రతా ఏర్పాట్లు, సౌకర్యాలు ఏర్పాటు చేశామని ఓటర్లు తప్పకుండా ఓటు వేయడానికి తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి బ్రహ్మయ్య, తహసిల్దార్లు శ్రీదేవి, శ్రీనివాసులు, శ్రీధర్, ఈశ్వరమ్మ, నోడల్ అధికారి రమేష్ బాబు, వీఆర్వోలు రమణ, పూజారి వెంకటరమణ, భద్ర, శ్రీనివాసులు, కంప్యూటర్ ఆపరేటర్లు కిషోర్, దినకర్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Admin
Namitha News