Thursday, 16 April 2026 08:02:33 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

ఓటింగ్ మొక్క ను నాటిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాఘవేంద్ర

Date : 28 April 2024 06:17 PM Views : 218

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె ఏప్రిల్ 28 : తంబళ్లపల్లె నియోజకవర్గం లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో వృక్ష సంపద ఎలా వృద్ధి చెందుతుందో అలా ఓటర్లు పోలింగ్ శాతం పెంచడానికి సహకరించాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాఘవేంద్ర సూచించారు. ఆదివారం తంబళ్లపల్లె తాసిల్దార్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాఘవేంద్ర ఓటింగ్ మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు తమ విలువైన ఓటు హక్కును తమకు నచ్చిన సరైన నాయకుని ఎన్నుకొని ప్రజాస్వామ్యానికి జీవం పోయాలన్నారు. ఓటు హక్కు వినియోగం ద్వారా ప్రజాస్వామ్య ఫలాలు ప్రజలందరూ అనుభవించడానికి చక్కటి అవకాశం ఏర్పడుతుందని కాన ప్రతి ఒక్కరు ఓటింగ్ లో పాల్గొని పోలింగ్ శాతం పెంచడానికి సహకరించాలన్నారు. తంబళ్లపల్లి గత సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ శాతం 75% ఉందని ఈ మారు ఎన్నికల్లో ఇంకా ఎక్కువ శాతం ఓటింగ్ జరగడానికి లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఓటర్లకు పోలింగ్ కేంద్రాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి భద్రతా ఏర్పాట్లు, సౌకర్యాలు ఏర్పాటు చేశామని ఓటర్లు తప్పకుండా ఓటు వేయడానికి తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి బ్రహ్మయ్య, తహసిల్దార్లు శ్రీదేవి, శ్రీనివాసులు, శ్రీధర్, ఈశ్వరమ్మ, నోడల్ అధికారి రమేష్ బాబు, వీఆర్వోలు రమణ, పూజారి వెంకటరమణ, భద్ర, శ్రీనివాసులు, కంప్యూటర్ ఆపరేటర్లు కిషోర్, దినకర్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :