నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : గుర్రంకొండ - జులై 26 : శనివారం నందు తొలి శ్రావణ శనివారం సందర్భంగా గుర్రంకొండ నుండి తరిగొండ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దర్శనార్థం పాదయాత్రను ఏర్పాటు చేయడమైనది. ఈ పాదయాత్ర లో గుర్రంకొండ లోని బంగాళా దగ్గర ఉన్న శ్రీ వినాయక స్వామి వారి ఆలయం నుండి తెల్లవార జామున 4 గంటలకు మొదలై దారి పొడవునా గోవింద నామములతో భక్తాదులు ఆలయానికి చేరుకున్నారు. ఈ పాదయాత్రను గుర్రంకొండ నుండి తరిగొండ వరకు ప్రతి సంవత్సరం మొదటి శ్రావణమాసం లోని మొదటి శనివారం మరియు వైకుంఠ ఏకాదశి నందు ఏర్పాటు చేస్తున్నారు. గత మూడు సంవత్సరాలుగా ఈ కార్యక్రమం మొదలై ఇప్పటికి 5సార్లు విజయవంతంగా పూర్తయింది. పాదయాత్రలో ప్రతి సంవత్సరం ఎక్కువ సంఖ్యలో పాల్గొనడం విశేషం.ఈ యాత్రలో వృద్ధులు, మహిళలు,చిన్నపిల్లలు కూడా పాల్గొనడం విశేషం. పాదయాత్రలో పాల్గొన్నవారికి ఆలయ అర్చకులు రాజు స్వామి గారు విశేషదర్శనం చేపించి, తీర్థప్రసాదాలు అందచేశారు. ఈపాదయాత్రలో సుంకర విజయ్ కుమార్, బీజేపీ రామాంజులు. ప్రసాద్ సాంబశివ, రాజా రెడ్డి, నవీన్ కుమార్ ఎస్.పి, రమేష్ బాబు, ఆనంద్,తిరుమలేష్,రెడ్డికుమార్,ప్రవీణ్,నిర్మల.పార్వతి, అనంతమ్మ, లక్ష్మీదేవి, రెడ్డి లక్ష్మి అమరావతి, తిరుమల తదితరులు పాల్గొన్నారు
Admin
Namitha News