నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి -సెప్టెంబర్14 : విజయవాడలో పది రోజుల క్రితం వరదలు కారణంగా నీట మునిగి సర్వం కోల్పోయిన వరద బాధితులను ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపుమేరకు మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ భాష వారం రోజులు పాటు శ్రమించి 50 లక్షల రూపాయలు విలువైన నిత్యవసర సరుకులు, గ్యాస్ స్టవ్లులు,బట్టలు మూడు లారీలలో తరలించి వరద బాధితులను ఆదుకోవడం 175 మంది ఎమ్మెల్యేలలో ప్రత్యేక స్థానాన్ని సాధించారని మదనపల్లి తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రశంసించారు.. శనివారం మదనపల్లి పట్టణం స్థానిక ఎన్టీఆర్ సర్కిల్ కూడలిలో జెసిబి వేణుఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి నివాళులు అర్పించిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ భాషా చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు, ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ కష్టమంటే చూడలేని వ్యక్తిగా, పేద ప్రజలను అభిమానించే మదనపల్లి శాసనసభ్యులు విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు తన వంతు సాయగా తెలుగుదేశం నాయకులు కార్యకర్తల సమన్వయంతో 50 లక్షల రూపాయల విలువైన నిత్యవసరాలను పోగుచేసి విజయవాడ వరద బాధితులకు రెండు రోజులుగా పంచి పెడుతుండటం ఆయన గొప్పతనానికి నిలువెత్తు నిదర్శనం అని అన్నారు. తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉన్న కార్యకర్తలను ప్రజలను ఆదుకునేందుకు ఎప్పుడూ ముందుంటుందని నిరూపించిన వ్యక్తి షాజహాన్ భాష అని గుర్తు చేశారు.. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ రంగస్వామి నాయుడు, ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పోతబోలు సుధాకర్,రామ్మూర్తి నాయుడు,పెరవల్లి మధు, పట్టణ ఉపాధ్యక్షుడు ఎర్రబల్లి వెంకటరమణారెడ్డి,నవీన్ చౌదరి,బిల్డర్ రామకృష్ణ, జీవీ నాయుడు, మేస్త్రి శ్రీనివాసులు, జేవి రమణ, రాయచోటి శశి కుమార్,చిప్పిలి చెన్రాయుడు,మాజీ కౌన్సిలర్ రాధా, పులి మహాలక్ష్మి,టీఎన్ఎస్ఎఫ్ ప్రభాకర్, శ్రీరామ వినోద్, భాస్కర్,ఆరిఫ్.పూలకుంట్ల హరి బాబు.పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు....
Reporter
Namitha News