నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాయచోటి: నమిత న్యూస్: సెప్టెంబర్ 21 :- వీరబల్లె మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో శుక్రవారంఎస్ జి ఎఫ్ క్రీడా పోటీలు నిర్వహించారు. వీరబల్లి జడ్పీ హైస్కూల్ పాఠశాల సిబ్బంది విద్యార్థుల విజ్ఞప్తి మేరకు పిల్లలందరికీ తమ సొంత నిధులతో పిల్లలకు క్రీడా దుస్తులు సమకూర్చిన వీరబల్లె ఎంపీపీ గాలివీటి రాజేంద్రనాథ్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేసిన ఉపాధ్యాయ బృందం . ఎంపీపీ గాలివీటి రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ క్రీడాకారులను ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ప్రతి ఒక్కరూ ప్రతిభను కనబరిచి మన మండలానికి పేరు తీసుకొని రావాలని కొనియాడారు. అంతేకాకుండా ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినీ విద్యార్థులకు అన్ని విధాలా ఆర్థికంగా తోడుంటామని తెలియజేశారు.
Reporter
Namitha News