నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అన్నమయ్య జిల్లా మదనపల్లె భార్య పై భర్త కత్తితో దాడి చేసి హత్యా యత్నం అనుమానం పెనుభూతమై భార్యను కత్తితో పొడిచి హత్యాయత్నానికి పాల్పడ్డ సంఘటన గురువారం వేకువ జామున జరిగింది. పోలీసుల కథనం మేరకు.. మదనపల్లె బసినికొండలో కాపురం ఉండే కులాయి నాయక్ భార్య ఆర్.సుజాత భాయి(36) అదే ప్రాంతానికి చెందిన వ్యక్తితో సన్నిహితంగా ఉన్నట్లు భర్త గుర్తించాడు. భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్నాడు. అర్ధరాత్రి వేళ ఫోన్లో మాట్లాడు తుండగా కత్తితో గొంతు, దొక్కలో పొడిచి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడ్డ బాధ్యతరాలన్నీ వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలించి, చికిత్స అనంతరం తిరుపతి రుయాకు రెఫర్ చేశారు...
Reporter
Namitha News