Thursday, 16 April 2026 04:33:11 PM
# మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష # జాతీయ అగ్నిమాపక సేవల వారోత్సవాలు-2026 పోస్టర్ ను ఆవిష్కరణ చేసిన శ్రీరాం చినబాబు # సీపీఐ కార్యాలయంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135 వ జయంతి # డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ ఘన నివాళులు అర్పించిన ఎంపీడీఓ గంగయ్య

మహాన్యూస్ కార్యాలయంపై దాడి దుర్మార్గపు చర్య - తీవ్రంగా ఖండించిన ది మదనపల్లి ప్రెస్ క్లబ్ పాత్రికేయులు

Date : 30 June 2025 04:14 PM Views : 290

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మహాన్యూస్ కార్యాలయంపై దాడి దుర్మార్గపు చర్య - తీవ్రంగా ఖండించిన ది మదనపల్లి ప్రెస్ క్లబ్ పాత్రికేయులు - మీడియా,మీడియా ప్రతినిధులపై దాడులు అరికట్టాలని విజ్ఞప్తి మదనపల్లె : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని మహాన్యూస్ కార్యాలయంపై బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు దాడి చేయడం హేయమైన చర్యని ది మదనపల్లి ప్రెస్ క్లబ్ తీవ్రంగా ఖండించింది.సోమవారం ది మదనపల్లి ప్రెస్ క్లబ్ కార్యాలయం నందు అధ్యక్షులు నక్కింటి రవీంద్ర ఆధ్వర్యంలో నిరసన తెలపడం జరిగింది.ఈ సందర్బంగా రవీంద్ర మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తున్న మహాన్యూస్ కార్యాలయంపై దాడి చేయడం ప్రజాస్వామ్య విలువలకు విఘాతమన్నారు.సమాజంలో నాలుగవ స్తంభంగా కొనసాగుతున్న ఎలక్ట్రానిక్,ప్రింట్ మీడియాలపై దాడిచేయడం అంటేనే మీడియా స్వేచ్ఛను హరించడమే అవుతుందన్నారు.బిఆర్ఎస్ పార్టీకి చెందిన అల్లరి మూకలు మహాన్యూస్ కార్యాలయంపై రాళ్లు కట్టెలతో దాడికి పాల్పడి కంప్యూటర్లు,అద్దాలు ధ్వంసం చేసి,దాడిచేయడాన్ని తీవ్రంగా ఖండించారు.అనంతరం ఉపాధ్యక్షులు నానాబాల కుమార్,సంయుక్త కార్యదర్శి ఈశ్వర్ రెడ్డి,కార్యవర్గ సభ్యుడు అశోక్ కుమార్లు మాట్లాడుతూ మీడియాపై దాడి చేయడం అంటే ప్రజాస్వామ్యంపైన దాడి చేయడమేనన్నారు.పాత్రికేయు లపైన,మీడియా కార్యాలయాలపైన దాడులు సమర్థనీయం కాదన్నారు.మీడియా,మీడియా ప్రతినిధులపై దాడులను అరికట్టడానికి కేంద్ర ప్రత్యేక చట్టం తీసుకురావాలని,ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ది మదనపల్లి ప్రెస్ క్లబ్ పాత్రికేయులు బి.శ్రీనివాసులు రెడ్డి,లక్ష్మి పతి,ప్రణీత్,విజయ్,మణి కుమార్,విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :