నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె డిసెంబర్ 18 : తంబళ్లపల్లె మండలం లో పంచాయతీల అభివృద్ధికి స్థానిక సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో భాగంగా ప్రతి ఒక్కరు మన లక్ష్యంగా కృషి చేయాలని ఎంపీడీవో ఉపేందర్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఎంపీడీవో కార్యాలయంలో స్థానిక సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై సర్పంచులు, సచివాలయ సిబ్బందికి రెండు రోజుల శిక్షణ కార్యక్రమాలలో భాగంగా గ్రామపంచాయతీ 20 30 చేరుకోవాలని దానికి అనుగుణంగా అభివృద్ధి ప్రణాళికలు రూపొందించుకొని ప్రతి గ్రామపంచాయతీ సర్వతో ముఖాభివృద్ధి సాధించాలన్నారు. ప్రతి గ్రామ పంచాయతీ లోని సమస్యలపై సర్పంచులు, సచివాలయ సిబ్బంది అధ్యయనం చేసి పరిష్కారానికి అందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఈఓఆర్డి దిలీప్ కుమార్ నాయక్, ఏవో థామస్ రాజా, సీనియర్ అసిస్టెంట్ బాలకృష్ణ నాయక్, మండలంలోని అధికారులు పాల్గొన్నారు.
Reporter
Namitha News