Thursday, 16 April 2026 08:05:23 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

జిల్లా జూనియర్ షూటింగ్ బాల్ జట్టుకు ఆరుగురు ఎంపిక

జిల్లా జూనియర్ షూటింగ్ బాల్ జట్టుకు ఆరుగురు ఎంపిక

Date : 25 August 2025 11:25 PM Views : 180

నమిత న్యూస్ - Andhra Pradesh / Chittoor : తంబళ్లపల్లె - ఆగస్టు 25 ః తంబళ్లపల్లె మండలం లోని ఆరుగురు విద్యార్థులు అన్నమయ్య జిల్లా జూనియర్ షూటింగ్ బాల్ జట్టుకు ఎంపికయ్యారు. ఆదివారం మదనపల్లెలోని గ్రీన్ వ్యాలీ ఇంటర్నేషనల్ స్కూల్ మైదానంలో జిల్లా షూటింగ్ బాల్ అసోసియేషన్ చైర్మన్ జునైద్ అక్బరీ, కార్యదర్శి గౌతమీ ఆధ్వర్యంలో జూనియర్స్ షూటింగ్ బాల్ అన్నమయ్య జిల్లా బాల, బాలికల జట్ల ఎంపిక జరిగింది. ఈ ఎంపికల్లో జిల్లా నుండి పలు పాఠశాలల నుండి వందల మంది విద్యార్థులు తమ ప్రతిభను కనబరిచారు. మండలంలోని కన్నెమడుగు ఉన్నత పాఠశాల 9వ తరగతి విద్యార్థినిలు రిషిత, ప్రియా వల్లిక తో పాటు స్టాండ్ బై గా స్వాతి ఎంపికయ్యారని పీడి ఖాదర్బాషా తెలిపారు. అదేవిధంగా కమ్మలపల్లి మోడల్ స్కూల్ నుండి ఇంటర్మీడియట్ చదువుతున్న గౌస్ మహమ్మద్, టెన్త్ విద్యార్థిని కరి మున్నిసా, 9వ తరగతి విద్యార్థి హర్షవర్ధన్ ఎంపికైనట్లు పీడి లత చెప్పారు. జిల్లా జట్టుకు ఎంపికైన విద్యార్థులను ఎంఈఓ లు త్యాగరాజు, నాగ సుబ్బరాయుడు, ప్రిన్సిపల్ హేమంత్ కుమార్, హెచ్ఎం మదన్మోహన్, ఎస్ఎంసి చైర్మన్లు, అధ్యాపకులు, ప్రజలు ప్రశంసించారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :