నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె నవంబర్ 9 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఎస్ హెచ్ జి ఇన్కమ్ ప్రొఫైలింగ్ సర్వే పారదర్శకంగా నిర్వహించాలని ఐకెపి ఎపిఎం గంగాధర్ పిలుపునిచ్చారు. శనివారం ఐకెపి కార్యాలయంలో సంఘ మిత్రల కు అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్ హెచ్ జి ఇన్కమ్ ప్రొఫైలింగ్ యాప్ సర్వేలో ప్రతి మహిళ గ్రూపు సభ్యురాలి ఉపాధి, వృత్తి, జీవనాధారం, బ్యాంకు రుణాలు, జీవనోపాధి ఏర్పాటు తో మెరుగైన ప్రణాళిక రూపకల్పన, తదితర అంశాలతో పాటు సభ్యురాలు కుటుంబంలోని సభ్యులు విద్య, ఉద్యోగం, ఉపాధి అవకాశాలు, భవిష్యత్తులో వారికి జీవనోపాధి ప్రణాళిక తదితర పూర్తి సమాచారాన్ని సేకరించాలన్నారు. సభ్యురాలు పూర్తి సమాచారాన్ని ఎలాంటి పొరపాట్లు లేకుండా సర్వే నిర్వహించాలని సర్వేకు పూర్తి బాధ్యత మీరే వహించాల్సి ఉందని హెచ్చరించారు. ఈ ఎస్ హెచ్ జి ఇన్కమ్ ప్రొఫైలింగ్ యాప్ సర్వే ద్వారా మహిళా సంఘాల సభ్యుల సమాచార సేకరణతో సభ్యుల భవిష్యత్ ప్రణాళిక ఏర్పాటు చేయడం జరుగుతుందని సర్వేలో ఎలాంటి తప్పులు లేకుండా చూడాలని సూచించారు. అవగాహన కార్యక్రమంలో సంఘమిత్రల సంఘ నాయకురాలు సిద్ధమ్మ ,ఐకెపి మండల అధ్యక్షురాలు రామలక్ష్మమ్మ, సీసీలు నరసింహులు, రమణ, ఆదిలక్ష్మి, మండలంలోని సంఘమిత్రలు పాల్గొన్నారు.
Reporter
Namitha News