నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - సెప్టెంబర్ 04 : ఈ ఏడాదికి గాను అన్నమయ్య జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా రామసముద్రం మండలం మట్లవారిపల్లి ఉన్నత పాఠశాల ఆంగ్ల ఉపాధ్యాయులు గా పనిచేస్తున్న బాలాజీ అలాగే మండలంలోని ఎన్ కమ్మతంపల్లి మోడల్ ప్రైమరీ పాఠశాల లో పనిచేస్తున్న బి. జ్యోతి ఎంపికయ్యారు . వీరి ఎంపిక పట్ల ఎస్ టి యు రాష్ట్ర ఉపాధ్యక్షుడు కడియాల మురళి ,కమతంపల్లె పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఎస్టియు సీనియర్ నాయకుడు మహమ్మద్ ఖాన్, రామసముద్రం మండల శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అయూబ్ ఖాన్, రమాదేవి, ఆర్థిక కార్యదర్శి సురేష్, మండల కార్యవర్గ సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు .
Admin
Namitha News