నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అన్నమయ్య జిల్లా మదనపల్లె నిమ్మనపల్లి బండ్లపై వద్ద దంపతులపై కత్తులతో దాడి.... *భార్యాభర్తల పరిస్థితి విషమం* అన్నమయ్య జిల్లాలోని మదనపల్లి నియోజకవర్గం, నిమ్మనపల్లి మండలంలోని బండ్లపై వద్ద దంపతులపై ప్రత్యర్థులు కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. శుక్రవారం రాత్రి 7.30 గంటలకు జరిగిన ఈ దాడిలో భార్యా భర్తలు తీవ్రంగా గాయపడగా, వారిని 108 సద్దాం, వాణి లు హుటాహుటిన మదనపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆస్పత్రి అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి వారికి మెరుగైన వైద్య చికిత్సలు అందించారు. బాధితులు చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలోని చౌడేపల్లి మండలం, యానాది పాలెం కు చెందిన దంపతులు శ్యామల(26) ఎర్రప్ప(30) గా పోలీసులు గుర్తించారు. దంపతులపై దాడికి పాల్పడ్డ ప్రత్యర్థులు బాదితుల పొరుగు గ్రామానికి చెందిన వారని తెలిపారు. ముగ్గురు వ్యక్తులు బైకులపై వచ్చి కోడి కత్తులతో విచక్షణ రహితంగా దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డట్టు బాధితురాలు శ్యామల ఆరోపించారు. నిమ్మనపల్లి మండలంలోని బండ్లపై శివాలయం వద్దకు రాగానే బైకును అడ్డగించి కత్తులతో పొడిచి చంపడానికి యత్నించారన్నారు.
Reporter
Namitha News