నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - అక్టోబర్ 28 : రామసముద్రం మండలం పెద్దకురప్పల్లె గ్రామ పంచాయతీ తిరుమలరెడ్డిపల్లె గ్రామంలో పశువైద్యకారిని పావని ఆధ్వర్యంలో తుఫాన్ వల్ల పశువులు కలిగిన రైతులకు జాగ్రత్త లు గురించి సలహాలు, సూచనలు కల్పించారు. పశువులు యజమానులతో మాట్లాడుతూ తుఫాన్ వల్ల పశువులను జాగ్రత్తగా చూసుకోవాలని ముఖ్యం గా పశువులను కరెంట్ స్థంబాలు ,పెద్ద పెద్ద వృక్షాలుదగ్గర పశువులను కట్టరాదన్నారు.గాలి, వెలుతురు కలిగిన షెడ్డు లలో పశువులను ఉంచాలన్నారు. పశువులకు ఏవైనా సమస్యలు వస్తే మాదృష్టికి తీసుకురావాలన్నారు.పశువులకు కావాల్సిన మందులు అందుబాటులో ఉంటాయాని ఎల్లప్పుడూ మా సిబ్బంది మీకు అందుబాటులో ఉంటామని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో పశువైద్యరాలు పావని జె ఈవో భానుప్రకాష్, ఏ హెచ్ ఓ రమేష్, గ్రామ సచివాలయం నరేష్, సత్యనారాయణ, ప్రజలు రైతులు పాల్గొన్నారు.
Admin
Namitha News