నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె డిసెంబర్ 27 : తంబళ్లపల్లె మండలం గుండ్లపల్లి సచివాలయంలో జరిగిన కొట్లపల్లి రెవెన్యూ సదస్సుకు 16 భూ సమస్యలు వచ్చినట్లు తాసిల్దారు హరిప్రసాద్ తెలిపారు. ఈ సదస్సులో రైతులు భూముల రెవెన్యూ రికార్డుల సవరణ, మానవుల ప్రాంతాలలోని తమ భూములకు రహదారి కల్పించాలని, రైతులు తమ జాయింట్ ఎల్ పి ఎం లను విడగొట్టి ఐబి మంజూరు చేయాలని, ఇంకా పలు భూ సమస్యలపై రైతులు ఫిర్యాదు చేశారు. రైతులిచ్చిన భూ సమస్యల పై తాసిల్దార్ హరిప్రసాద్ వెంటనే స్పందించి ప్రతి సమస్యను కూలంకషంగా విచారణ చేసి త్వరగా పరిష్కరించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డిటి రవీంద్ర, ఆర్ ఐ ముద్దుకృష్ణ, సర్వేయర్ నరేంద్ర, దేవాదాయ శాఖ రికార్డ్ అసిస్టెంట్ కొండకిట్ట, ఫారెస్ట్ అధికారి రామరాజు, వీఆర్వో భాష, వీఆర్ఏలు, రైతులు పాల్గొన్నారు.
Reporter
Namitha News