నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - అక్టోబర్ 22 : రామసముద్రం మండలం అరికల గ్రామ పంచాయతీ చిట్టెంవారిపల్లెలో గత వారం ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకున్న విషయం తెలిసిందే.ఎస్సై రమేష్ బాబు బుధవారం ఘటనస్థలానికి చేరుకుని సంబంధిత వ్యక్తుల నుంచి సాక్షాలు, సంబంధిత వివరాలు సేకరించారు. ఎస్సై ఇరువురుతో మాట్లాడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్సై రమేష్ బాబు హెచ్చరించారు. ఏవైనా సమస్యలు ఉంటే మమ్మల్ని సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై రమేష్ బాబు, హెడ్ కానిస్టేబుల్ కిరణ్ కుమార్ పాల్గొన్నారు.
Admin
Namitha News