నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - సెప్టెంబర్ 17 : రామసముద్రం మండలం లోని చొక్కాండ్లపల్లి గ్రామ పంచాయతీని బుధవారం ఎంపీడీవో గపూర్ సందర్శించారు. పంచాయతీ కార్యదర్శి భానుమూర్తి ఆధ్వర్యంలో పారిశుద్ధ్య పనులపై ప్రజలకు అవగాహన కల్పించారు. స్వామిత్వ సర్వే వేగవంతం చేయాలని అధికారులకు తెలియజేశారు. అలాగే వాహనమిత్ర పథకం కింద ప్రతి సంవత్సరం 15000 రూపాయల ఆర్థిక సహాయం కొరకు అర్హత ఉన్న ఆటో,ట్యాక్సీ డ్రైవర్లు ఆయా సంబంధిత గ్రామ సచివాలయాల్లో17నుంచి 19వరకు సరైన పత్రాలు సమర్పించి దరఖాస్తు చేసుకోవాలని, 24వ తేదీన అర్హుల జాబితాను విడుదల చేస్తామని తెలియజేశారు.
Admin
Namitha News