నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె జూన్ 14 ః తంబళ్లపల్లె కు నూతనంగా వచ్చిన యస్.ఐ. ఉమామహేశ్వర్ రెడ్డిని శనివారం తంబళ్లపల్లె మండల టిడిపి అధ్యక్షుడు రెడ్డప్పరెడ్డి, సిద్ధమ్మ ల ఆధ్వర్యంలో నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు తంబళ్లపల్లెలో ట్రాఫిక్, డ్రంక్ అండ్ డ్రైవ్, శాంతి భద్రతల పై చర్యలు తీసుకోవాలని కోరగా ఆయన సానుకూలంగా స్పందించి మండలంలో శాంతిభద్రతల తోబాటు అసాంఘిక చర్యల పై కఠినంగా వ్యవహరిస్తామని ఇందుకు మీ పూర్తి సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుళ్లు నరసింహులు, నాగేశ్వరరావు, టిడిపి నాయకులు మాజీ జెడ్పిటిసి రామచంద్ర, కాలా నారాయణ, పురుషోత్తం, రేపన్న సోమశేఖర్ ,నరసింహులు, సుధాకర్ రెడ్డి, సామి రెడ్డి, రెడ్డప్ప నాయుడు ,రెడ్డప్ప నాయుడు, శివారెడ్డి, మధు, రామాంజులు, మల్లికార్జున, రామలక్ష్మమ్మ, నరేంద్ర నాయుడు, రెడ్డప్ప కార్యకర్తలు పాల్గొన్నారు.
Reporter
Namitha News