నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : విశ్వం ఇంజనీరింగ్ కళాశాల లో ఘనంగా ఇంజనీర్స్ డే అంగల్లు సమీపంలోని విశ్వం ఇంజనీరింగ్ కళాశాల లో సోమవారం (15-09-2025) ఇంజనీర్స్ డే నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా. డి. రమణా రెడ్డి తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. డి. రమణా రెడ్డి మాట్లాడుతూ దేశ అభివృద్ధి లో ఇంజనీర్లు అందించే సేవలకు, సాంకేతిక నైపుణ్యాలకు కృతజ్ఞతలు తెలుపుటకు ఈ రోజు మనం ఇంజనీర్స్ డే జరుపుతున్నామని తెలిపారు. యువతను ఇంజనీరింగ్ వైపు ఆకర్శించడానికి, ఆవిష్కరణలు చేయడానికి సివిల్ ఇంజనీరింగ్ ఎంతగానో ఊయోగ పడుతుందని తెలిపారు. డీన్ ఆఫ్ స్టూడెంట్స్ ఏఫైర్స్ డా. ఎల్. తిమ్మయ్య మాట్లాడుతూ ఇంజనీర్లు భవనాలు, రోడ్లు, వంతెనలు, పరిశ్రమలు నిర్మించడం మరియు ఆధునిక సౌకర్యాలు లో కీలక పాత్రను వివరిస్తూ, భారత దేశానికి మోక్షగుండం విశ్వేశ్వరయ్య చేసిన సేవలను ఈరోజు గుర్తుంచుకోవాలని, ఇంజనీర్లు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎలా పంచుతారో విద్యార్థులకు వివరించారు. ఎస్సే రైటింగ్ మరియు పోస్టర్ ప్రెసెంటేషన్ లో ప్రతిభను సాధించిన విద్యార్థులకు మూమెంటోస్ అందజేశారు. విశ్వం గ్రూప్స్ చైర్మన్ ఎం. ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఇంజనీరింగ్ లో మోక్ష గుండం విశ్వేశ్వరయ్య అతున్నత శిఖరాలు ను అధిరోహించి, ప్రపంచ ప్రక్యాత నిర్మాణాలను ఆవిష్కరించారాని, ఆయన ఆశయాలను విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమం లో కళాశాల చైర్మన్ ఎం. ప్రభాకరెడ్డి, ప్రిన్సిపాల్ డా. డి. రమణా రెడ్డి, డీన్ ఆఫ్ స్టూడెంట్స్ ఎపైర్స్ డా. ఎల్. తిమ్మయ్య హెస్. ఓ. డీస్, డీన్స్, అధ్యాపకులు, మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
Reporter
Namitha News