నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : కురబలకోట - సెప్టెంబర్25 : కురబలకోట జడ్పి హై స్కూల్ లో జిల్లా స్థాయి ఆటల పోటీలకు జరిగిన సెలక్షన్ కార్యక్రమంలో పాల్గొన్న తంబల్లపల్లి తెలుగుదేశం ఇంచార్జీ దాసిరిపల్లి జయచంద్రా రెడ్డి . ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యారిని , విద్యార్థులు పాఠశాల స్థాయి నుండే చదువుతో పాటు క్రీడ లలో కూడా రాణించాలని , ఆట లలో పాల్గొంటే చురుకుదనం , మానసికంగా కూడా దృడంగా తయారవుతారని , మీకు ఏ ఆట పై మక్కువ ఉంటే ఆ ఆట లలో ప్రాక్టీస్ చేస్తూ ప్రావీణ్యం సంపాదించండి అని తెలుపుతూ మీకు ఆటల పోటీలపై మక్కువ పెరగాలనే సంకల్పంతో గెలుపొందిన విద్యార్థులకు జె.సి.ఆర్. ఆర్మీ తరపున నగదు ప్రోత్సాహకాలు ప్రధమ స్థానం కు యాభై వేల రూ , ద్వితీయ స్థానం కు 25 వేల రూ నగదు ప్రోత్సాహకం అందిస్తామని తెలిపారు . స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ మండల స్థాయి క్రీడా జోనల్ పోటీలల ఎంపిక కార్యక్రమంలో పారిశ్రామికవేత్త మంత్రి గిరిధర్ రెడ్డి, అన్నమయ్య జిల్లా స్కూల్స్ క్రీడా సెక్రెటరీ వసంత, పాఠశాల చైర్మన్ రఫీ హెచ్ఎం త్రివాణి, కురబలకోట కన్వీనర్ వైజి సూరి , తంబళ్లపల్లి నియోజకవర్గం ఎస్సీ సెల్ శ్రీనివాసులు,ఈడి బాలాజీ నాయక్ ఎక్స్ మండల్ ప్రెసిడెంట్ రాఘవరెడ్డి, తుమ్మ చెట్టుకు సూరి బాలకృష్ణ కన్నె మడుగు బాబు వసంతపుసమోహన్ రెడ్డి మస్తాన్ రెడ్డి గ్రామ కమిటీ మల్లికార్జున శ్రీనివాసులు మరియు టిడిపి నాయకులు , ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Admin
Namitha News