Tuesday, 16 December 2025 07:44:37 AM
# మిట్స్ యూనివర్సిటీ లో ఎంబెడెడ్ సిస్టమ్స్ పై స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం # విగ్రహ ఆవిష్కరణకు తంబళ్లపల్లె నుండి భారీగా తరలిన కార్యకర్తలు # చౌడసముద్రం ఏరు పై బ్రిడ్జి నిర్మాణం చేపట్టండి # మురికినీటి కాలువల పై మూతలు వేయడం మరిచారా ...? # గంగిరెడ్డిపల్లి లో సిసి రోడ్లు నిర్మాణం చేపట్టండి # అసైన్డ్ చట్ట సవరణ పై జనవరి 4న జరుగు జిల్లా భూ సదస్సును జయప్రదం చేయండి బి కే యం యు జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ రామ్ ప్రియా.ఆర్ కు డాక్టరేట్ # తంబళ్లపల్లె లో శునకాల స్వైర విహారం # గుంతల రోడ్లకు మరమ్మత్తులు చేపట్టండి # తంబళ్లపల్లె లో ప్రశాంతంగా నవోదయ పరీక్షలు # అటల్ మోదీ సుపరి పాలన యాత్ర విజయవంతం చేయండి - మండలం అధ్యక్షులు రామాంజులు # *క్రిప్టిక్స్8.0 – బెంగళూరులో జరిగిన ఆల్ ఇండియా కంప్యూటర్ క్విజ్ పోటీలలో సత్తా చాటిన విశ్వం సీబీఎస్సీ పాఠశాల విజేతలు # మదనపల్లి యువకుడు నరసింగాపురం లో దారుణ హత్య # మంత్రి మండిపల్లి ని కలిసిన గుర్రంకొండ జనసేన నేత నక్క గోపికృష్ణ # పంటల దిగుబడికి కొత్త మెలుకువలు, పద్ధతులపై అవగాహన # వైష్ణవి దేవి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు # విశ్వం స్కూల్ విద్యార్థుల జాగృతి కార్యక్రమం # విశ్వం ఇంజనీరింగ్ కళాశాల నందు ఏఐ యుగంలో గ్లోబల్ క్రాస్ కమ్యూనికేషన్ అనే అంశంపై అవగాహన సదస్సు # మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ లో పేరెంట్స్ సమావేశం # మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ ని సందర్శించిన పాలిటెక్నిక్ విద్యార్థులు

రేపు మదనపల్లె డివిజన్‌లో ప్రత్యేక విద్యుత్ అదాలత్

Date : 19 May 2025 08:04 PM Views : 108

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రేపు మదనపల్లె డివిజన్‌లో ప్రత్యేక విద్యుత్ అదాలత్ మదనపల్లె రూరల్ మేజర్ న్యూస్ మే 19: ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఎ.పి.యస్.పి.డి.సి.ఎల్) ఆధ్వర్యంలో మదనపల్లె డివిజన్ పరిధిలో ప్రత్యేక విద్యుత్ అదాలత్‌ను రేపు అనగా మే 21 బుధవారం ఉదయం 11.30 గంటల నుండి మధ్యాహ్నం 1.30 గంటల వరకు ఈ అదాలత్‌ జరగనున్నదని ఎ.పి.యస్.పి.డి.సి.ఎల్ కార్యనిర్వాహక ఇంజనీరు యం. గంగాధరం తెలిపారు. ఈ ప్రత్యేక అదాలత్ మదనపల్లె ఆపరేషన్ డివిజన్ పరిధిలోని మదనపల్లె ఆపరేషన్, మదనపల్లె రూరల్ మరియు మొలకలచెరువు సబ్ డివిజన్లకు సంబంధించిన వినియోగదారుల ఫిర్యాదులపై దృష్టి సారించనున్నదన్నారు. ఈ కార్యక్రమం డివిజన్ ఆఫీస్ కాంపౌండ్, సీటీయం రోడ్డులోని కార్యాలయంలో ప్రత్యేక విద్యుత్ అదాలత్ నిర్వహించబడుతుందన్నారు. ఈ కార్యక్రమానికి చైర్ పర్సన్‌ రిటైర్డ్ జడ్జి వి. శ్రీనివాస ఆంజనేయ మూర్తి, ఆర్థిక సభ్యులు కె. రామమోహన్ రావు, సాంకేతిక సభ్యులు యస్.ఎల్. అంజనీ కుమార్, స్వతంత్ర సభ్యులు డబ్లు. విజయలక్ష్మి అదాలత్‌ను పర్యవేక్షించనున్నారన్నారు. ఈ అదాలత్‌కు సంబంధించి సిజిఆర్ఎఫ్ (కన్స్యూమర్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ ఫోరమ్) అధికారులు, సిబ్బంది హాజరుకానున్నారన్నారు. వినియోగదారులు తమ దీర్ఘకాలిక సమస్యలను వ్రాతపూర్వకంగా అందజేసి, ఈ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవాలని ఆయన కోరారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2025. All right Reserved.



Developed By :