నమిత న్యూస్ - Andhra Pradesh / AMARAVATHI : తంబళ్లపల్లె ఏప్రిల్ 14 : రాజ్యాంగ సృష్టికర్త, అన్నగారు వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిరస్మరణీయుడని ఎమ్మార్పీఎస్ నాయకులు వెంకటప్ప, వేట మల్లికార్జునలు తెలిపారు. ఆదివారం తంబళ్లపల్లె తాసిల్దార్ కార్యాలయం ఎదుట డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జన్మదిన సందర్భంగా ఎంఆర్పిఎస్ నాయకులు, కార్యకర్తలు ఆయన చిత్రపటానికి పూజలు నిర్వహించి అనంతరం భారీ కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేడు ఎస్సి, ఎస్టి, బిసి, మైనారిటీ ల సంక్షేమం కోసం అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వారి పాలిట ఆశాజ్యోతి గా నిలిచినట్లు చెప్పారు. భవిష్యత్తులో సైతం నేటి ఆధునిక సమాజం అంబేద్కర్ అడుగుజాడలలో నడిచి మార్గదర్శకులుగా నిలవాలని సూచించారు. అనంతరం అంబేద్కర్ అమర్ రహే నినాదాలతో క్రాస్ రోడ్డు హోరెత్తించారు. అదేవిధంగా తాసిల్దార్ కార్యాలయంలో అంబేద్కర్ జయంతి రెవెన్యూ అధికారులు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు, మండలంలోని విఆర్వోలు, వీఆర్ఏలు, సిబ్బంది పాల్గొన్నారు.
Admin
Namitha News