నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - అక్టోబర్ 27 : అన్నమయ్య జిల్లా నియోజకవర్గం మదనపల్లి జిఆర్.టి హైస్కూల్ లో రాష్ట్రస్థాయి అండర్ 17, 14 బాలికల హ్యాండ్ బాల్ పోటీలలో అరికెల జడ్పీ హైస్కూల్లో 9వ తరగతి చదువుతున్న జి. దీపిక అండర్ 14 కు 9వ తరగతి చదువుతున్న ఆర్. కల్పన పాల్గొని, ఉత్తమ ప్రతిభ కనబరిచి జిల్లా జట్టుకు సెలెక్ట్ అవ్వడం జరిగింది.పి డి ఉదయ్ కుమార్ మాట్లాడుతూ మదనపల్లి జి ఆర్ టి గ్రౌండ్ లో జరిగిన అండర్ 17,14హ్యాండ్ బాల్ పోటీలో ఉత్తమ ప్రదర్శన కనబరచి రాష్ట్ర స్థాయిపోటీలకు ఎంపికయ్యారని వీరు గుంటూరు లో 31వతేదీ నుండి నవంబర్ 2వరకు అండర్ 14 అన్నమయ్య జిల్లా కలకడ నవంబర్ 8 నుండి 10వ తేది వరకు జరిగే రాష్ట్ర స్థాయి పాల్గొంటారన్నారు.ఈ సందర్భంగా అరికెల జడ్పీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు వెంకటాచలపతి రాజు వ్యాయామ ఉపాధ్యాయులు ఉదయ్ కుమార్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, తోటి విద్యార్థులు అభినందనలు తెలిపారు.
Admin
Namitha News