నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మొలకలచెర్వు - సెప్టెంబర్ 22 : చౌదసముద్రం లో గ్రామసభ పూర్తి చేసుకొని తిరిగివచ్చే క్రమంలో రోడ్డు ప్రమాద ఘటనను చూసిన వెంటనే స్పందించిన తంబళ్లపల్లి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ దాసరిపల్లి జయచంద్రారెడ్డి క్షతగాత్రున్ని వెంటనే తన వాహనం లో ఆసుపత్రికి తరలించాలని తన సిబ్బందికి తెలుపగా , తరలించే క్రమంలోనే 108 వాహనం రావడం తో 108 వాహనం లోనే పంపిస్తూ మెరుగైన వైద్యం అందించాలని సూచించిన జయచంద్రా రెడ్డి . క్షతగాత్రుడు చుంచువారిపల్లె కి చెందిన వ్యక్తి గా గుర్తింపు . రోడ్డు ప్రమాదం పై స్పందించిన తీరుకు పలువురు జయచంద్రా రెడ్డి ని ప్రశంసించారు .
Admin
Namitha News