నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె డిసెంబర్ 7 : ః తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉపాధ్యాయుల క్రమశిక్షణ, విద్య తో విద్యార్థికి మంచి భవిష్యత్తు ఉంటుందని ఎస్సై లోకేష్ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం మండలంలోని పాఠశాలల్లో జరిగిన పేరెంట్స్, టీచర్స్ ఆత్మీయ సమావేశాలు పండుగ వాతావరణం మరిపించింది. ఉదయం నుండి ఎంపీడీవో ఉపేందర్ రెడ్డి, ఎంఈఓ త్యాగరాజుల సూచనల మేరకు హైస్కూల్లు, ప్రాథమికోన్నత, ప్రాథమిక పాఠశాలల్లో ఎన్నడూ లేని విధంగా విద్యార్థుల తల్లిదండ్రులు హాజరై ఉపాధ్యాయులతో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో పాల్గొని తమ బిడ్డల భవిష్యత్తు బంగారు బాట పట్టించాలని సభా ముఖంగా తెలియజేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు సైతం విద్యార్థికి క్రమశిక్షణతో కూడిన విద్య అందించడానికి తల్లిదండ్రుల సహకారం ఉండాలన్నారు. పాఠశాలలో తమ బిడ్డల విద్య తోపాటు సౌకర్యాలను పర్యవేక్షించి తగు సలహాలు సూచనలు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమాలలో విద్యార్థులు , తల్లిదండ్రులు కు పలు రకాల పోటీలు నిర్వహించి బహుమతులు ఎస్సై లోకేష్ రెడ్డి,ఎంఈఓ 2 నాగ సుబ్బరాయుడు, మండల టిడిపి అధ్యక్షుడు రెడ్డప్పరెడ్డి, మహిళా నేత సిద్ధమ్మ, పాఠశాల కమిటీ చైర్మన్లు, ప్రధానోపాధ్యాయులు, అధ్యాపకులు పంపిణీ చేశారు. అనంతరం విద్యార్థులు తమ తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులతో సహపంక్తి భోజనం చేసి ఆహ్లాదంగా గడిపారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Reporter
Namitha News