Thursday, 16 April 2026 08:07:00 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

ఎన్నికల్లో కూటమి విజయం పై తంబల్లపల్లె లో సంబరాలు

Date : 05 June 2024 07:25 PM Views : 203

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె జూన్ 5 : రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రికార్డు మెజారిటీ సాధించడంతో తంబళ్లపల్లె లో బుధవారం టిడిపి, జనసేన, బిజెపి ఉమ్మడి పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఎన్టీఆర్ చిత్రపటానికి పూజలు నిర్వహించి భారీ కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా కార్యకర్తలు ఎన్టీఆర్ అమర్ రహే, కాబోయే సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నాయకత్వాలు వర్ధిల్లాలి నినాదాలతో హోరెత్తించారు. పెద్ద ఎత్తున బాణసంచా పేల్చారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ రాష్ట్రానికి శనిలా దాపురించిన వైకాపా ప్రభుత్వం మట్టి కరిసిందని, రాబోయే కూటమి పాలనలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్ గా మారి ప్రజలు స్వేచ్ఛ వాయువులతో జీవించడం ఖాయమన్నారు. చంద్రబాబు నాయుడు సారధ్యంలో ప్రతి కుటుంబానికి ఎన్నికల హామీలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి రాష్ట్రం సర్వతో ముఖాభివృద్ధి సాధిస్తుందని హర్షద్వానాల మధ్య ప్రకటించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు గోపి దిన్ని ఉత్తమ రెడ్డి, బీసీ నాయకుడు చంద్ర,పురుషోత్తం, రామ్మోహన్ రెడ్డి, భాస్కర్, జగదీష్, సుధాకర్ రెడ్డి, గుండ్లపల్లి కాలా నారాయణ, కోసువారిపల్లె హరి, ముద్దలదొడ్డి మదన్ మోహన్ రెడ్డి, అప్పి రెడ్డి,రామచంద్ర, గట్టుమీద శంకర్ రెడ్డి, కోటకొండ బీసీ రెడ్డప్ప, చలపతి నాయుడు, బేరి శ్రీనివాసులు, జయరాం రెడ్డి, సోమశేఖర్, నరసింహులు, మ్యూజికల్ శివ, వందలాదిమంది టిడిపి, జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :