నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబల్లపల్లె- డిసెంబరు 02 :తంబళ్లపల్లె మండల కేంద్రంలో ఆదివారం మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ పుట్టినరోజు వేడుకలు భారీ వర్షంలోతెలుగుదేశం నాయకులు ఘనంగా నిర్వహించారు. ఉదయం తెలుగుదేశం పార్టీ మండల నాయకులు పురుషోత్తం బాబు, ముద్దలదొడ్డి వెంకటరెడ్డి, మాజీ మల్లయ్య కొండ చైర్మన్ గంగుల్ రెడ్డి,తెలుగు యువత మండల అధ్యక్షుడు గంగరాజు, గోపి దిన్ని హై స్కూల్ కమిటీ చైర్మన్ వీరాంజనేయులు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ ఘాట్ లో జి శంకర్ యాదవ్ చిత్రపటం ముందు భారీ కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు. తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వం వర్ధిల్లాలి, జి శంకర్ యాదవ్ నాయకత్వం వర్ధిల్లాలి నినాదాలతో హోరెత్తించారు. మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ రాజకీయంగా ఉన్నత స్థానానికి ఎదిగి ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథి పెద్దమండెం మండలం పార్టీ అధ్యక్షుడు బిల్డర్ రమణ, తెలుగు యువత నియోజకవర్గ నేత సుదర్శన్, స్థానిక నాయకులు ఎర్రసానిపల్లి సుధాకర్, రామచంద్రారెడ్డి, గోపి దీన్ని మాజీ సర్పంచ్ సుధాకర్, ఉపేందర్ రెడ్డి, గ్రామ కమిటీ ఉపాధ్యక్షుడు రెడ్డెప్ప, హై స్కూల్ కమిటీ చైర్మన్ శివకుమార్, గట్టుమీద శంకర్ రెడ్డి, కన్నె మడుగు సోమశేఖర్, బాలకృష్ణారెడ్డి, సుభహాన్,శేఖర్, మ్యూజికల్ శివ, నాగభూషణం, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Reporter
Namitha News