నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : నారమాకులతాండా మారెమ్మ జాతరలో అమ్మవారిని దర్శించుకున్న వైసిపి సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్.... నారమాకులతాండా ప్రజల ఆరాధ్య దైవం, తాండా ప్రజల కల్పవల్లిగా ప్రసిద్ధి చెందిన మారెమ్మ జాతరలో అమ్మవారిని దర్శించుకొని, ప్రత్యేక పూజలలో పాల్గొన్న మదనపల్లె వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్... స్దానిక వైసిపి నాయకులు, తాండా ప్రజల ఆహ్వానం మేరకు నిస్సార్ అహమ్మద్ జాతరలో పాల్గొన్నారు. మారెమ్మ అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజలు గావించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా నిస్సార్ అహమ్మద్ మాట్లాడుతూ నారమాకులతాండా ప్రజల ఆరాధ్య దైవం మారెమ్మను దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ జాతరలో సర్పంచ్ మంగు నాయక్, ఆనంద్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, హరి నాయక్, ఎస్.రెడెప్ప నాయక్, మునిస్వామి నాయక్, నర్సింహులు నాయక్, నాగు నాయక్, ఈశ్వర్ నాయక్, మహేష్, నర్సింహులు, మల్లికార్జున రెడ్డి వైసిపి నాయకులు పాల్గొన్నారు.
Reporter
Namitha News