Thursday, 16 April 2026 08:01:06 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

ప్రమాదం బారిన పడి చికిత్స పొందుతూ వలస కూలి మృతి

జీవనోపాధి కై వెళ్లి విగత జీవుడై వచ్చిన శిద్దారెడ్డి

Date : 22 March 2025 07:29 PM Views : 274

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మార్చి 22 : తంబళ్లపల్లె నియోజకవర్గం కరువు కు పుట్టినిల్లు. భూములున్నా సకాలంలో వర్షాలు లేక సాగునీటి సౌకర్యం లేక వేసిన పంటలకు గిట్టుబాటు లేక రైతులు దినసరి వలస కూలీలకు వెళ్లి ప్రమాదంలో మృత్యువాత పడింది ఓ రైతు దీనగాధ. తంబళ్లపల్లి మండలం గుండ్లపల్లి పంచాయతీ చెట్లవారిపల్లి కు చెందిన మాచి రెడ్డి గారి సిద్ధారెడ్డి (55) మధ్యతరగతి రైతు. జీవనోపాధి కోసం పలువురు సుదూర ప్రాంతాలకు టమోటా కర్రలు నాటే పనికి వెళుతుండగా సిద్ధారెడ్డి సైతం విధి లేని పరిస్థితుల్లో మదనపల్లెకు సమీపంలోని చెంబకూరు సమ్మి రెడ్డి గారి పల్లి లో టమోటా పంటలకు కర్రలు నాటే పనికి వారం రోజులు క్రితం వెళ్ళాడు. అక్కడ టమోటా కర్రలు తరలించే క్రమంలో ఆ కర్రలు మొత్తం సిద్ధారెడ్డి మీద పడి కర్రలు తలలో దిగడం తోపాటు కింద రాళ్లు తలకు తగిలి తీవ్ర రక్త గాయమై అపస్మారక స్థితికి చేరుకున్నాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు సిద్ధారెడ్డిని మదనపల్లె ఆసుపత్రికి తరలించగా పరిస్థితి చేయి దాటిందని వెంటనే బెంగళూరు వెళ్లాలని సూచించారు. బెంగళూరు సెయింట్ జాన్స్ ఆస్పత్రిలో మెరుగైన చికిత్సకు చేర్పించారు. వారం రోజులుగా సిద్ధారెడ్డి ఆరోగ్యం క్షీణించి కోమాలోకి వెళ్లాడు. ఆయన ఆరోగ్యం కోసం కుటుంబ సభ్యులు ఇంటి వద్ద నుండి నగనట్రా అమ్ముకుని అందిన కాడికి అప్పులు చేసి సుమారు ఆరు లక్షలకు పైగా ఖర్చు చేశారు. శనివారం తెల్లారి జామున పరిస్థితి విషమించి సిద్ధారెడ్డి ఆసుపత్రిలో కన్ను మూశాడు. జీవనోపాధికి వెళ్లి విగత జీవుడై రావడం, పుట్టెడు అప్పులు మిగలడం ఆ కుటుంబం ఆర్థికంగా చితికిపోయింది. డబ్బులు పోతే పోనీ మనిషి మిగలకపాయనే స్వామి అని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. జూనోపాధి కోసం వెళ్లి మృత్యువాత పడిన సిద్ధారెడ్డి కుటుంబాన్ని ప్రభుత్వం వెంటనే ఆర్థికంగా ఆదుకోవాలని స్థానిక ప్రజా ప్రతినిధులు,ప్రజలు కోరుతున్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :