నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : యువత తాము ఎంచుకున్న రంగాల్లో రాణించాలి - వన్ టౌన్ సీఐ చాంద్ బాషా ఆకాంక్ష మదనపల్లె : యువత తాము ఎంచుకున్న రంగాల్లో రాణించాలని వన్ టౌన్ సీఐ చాంద్ బాషా పేర్కొన్నారు.గురువారం పట్టణంలోని ఎన్జీవో హోం పక్కన ఎస్.ఎం.డి బ్రదర్స్ ఆధ్వర్యంలో రూపొందిన మాషా అల్లా బిర్యానీ సెంటర్ ప్రారంభోత్సవానికి సీఐ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా చాంద్ బాషా మాట్లాడుతూ ప్రస్తుతం యువత తమ అభిరుచి మేరకు రంగాలను ఎంచుకొని అందులో విజయవంతం కావాలన్నారు.ముఖ్యంగా ఎస్.ఎం.డి బ్రదర్స్ రూ.99లకే దమ్ బిర్యానీ అందించడం హర్షణీయమన్నారు.అదేవిధంగా మాషా అల్లా బిర్యానీ సెంటర్ వ్యాపారం పరంగా అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.అనంతరం బిర్యానీ సెంటర్ నిర్వాహకులు ఎస్.అక్బర్ బాషా మాట్లాడుతూ తమ హోటల్ నందు ఉదయం ధమ్ బిర్యానీ,కుష్కా సిద్ధంగా ఉంటుందని,సాయంత్రం 4 గంటల నుండి చికెన్ కబాబ్,చిల్లీ చికెన్,యాపిల్ చికెన్,లెగ్ పీస్ తదితర వెరైటీలు అందుబాటులో ఉంటాయన్నారు.కేవలం రూ.99లకే రుచికరమైన బిర్యాని పట్టణ ప్రజలకు అందించడం మా ప్రత్యేకత అన్నారు.తమ హోటల్ వంటకాల రుచులను ప్రజలు ఆస్వాదించాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో నాసిర్,సాధిక్,డ్యాన్స్ రెడ్డెప్ప,కోన భాస్కర్,నాగరాజ,చంద్ర నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News