నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - సెప్టెంబర్ 29 : అన్నమయ్య జిల్లా మదనపల్లె పరిసర ప్రాంతాల్లో ఇళ్లల్లో చోరీలకు పాల్పడే అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు చేసి , ముద్దాయి నాగరాజు నుండీ సుమారు 28 లక్షల విలువ చేసే బంగారు వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకొని ముద్దాయి ని రిమాండ్ నిమిత్తం కోర్టు కు తరలిస్తున్నట్లు వెల్లడించిన మదనపల్లి పోలీసులు . ఇళ్లల్లో చోరీలకు భయపడే అంతరాష్ట్ర దొంగను అరెస్టు చేసి, 28లక్షల విలువచేసే వెండి, బంగారం సీజ్ చేసినట్లు మదనపల్లె డిఎస్పీ కొండయ్య నాయుడు తెలిపారు. కర్ణాటక రాష్ట్రం, శ్రీనివాసపురం తాలూకా, బైరిగానిపల్లె చలపతి కొడుకు టిసి. నాగరాజా(30) కర్ణాటక రాష్ట్రం నుంచి మదనపల్లి, రామసముద్రం మండలాలలో తాళంవేసిన ఇళ్లల్లో చోరీలకు పాల్పడేవాడన్నారు. ఆదివాగం కొత్తపల్లి గ్రామం, ఈశ్వరమ్మ కాలానీలో నా గరాజును అరెస్టు చేసినట్లు తెలిపిన డిఎస్పీ కొండయ్య నాయుడు
Admin
Namitha News