నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె నియోజకవర్గం లో రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ పూర్వ వైభవం సంతరించుకొని ఘన విజయం సాధించడానికి సమిష్టిగా కృషి చేస్తామని టిడిపి రాజంపేట పార్లమెంట్ ఉపాధ్యక్షుడు కొటాల శివకుమార్ ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆదేశాలు, మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ సూచనలతో తంబళ్లపల్లె మండలంలోని కొటాల పంచాయతీలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తంబళ్లపల్లె నియోజకవర్గంలో గత వైకాపా పాలనలో అభివృద్ధి జరిగింది శూన్యమన్నారు. మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ ఎమ్మెల్యేగా తంబళ్లపల్లె నియోజకవర్గం అభివృద్ధికి వేల కోట్లు తెచ్చిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. వైకాపా పాలనలో అభివృద్ధి జరగకపోగా అవినీతి, అరాచక, దౌర్జన్యాల పాలన కొనసాగుతోందని రాబోయే ఎన్నికల్లో తంబళ్లపల్లె ప్రజలు తగిన బుద్ధి చెప్తారని నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అటు అసెంబ్లీ ఇటు పార్లమెంటు కు గతంలో ఎన్నడూ లేని మెజారిటీ సాధించి తంబళ్లపల్లె ను చంద్రబాబు నాయుడుకు కానుకగా ఇస్తామన్నారు. మారుమూల గ్రామాలలో ఎక్కడకు వెళ్లిన ప్రజలు టిడిపికి బ్రహ్మ రథం పడుతున్నారని ఇదే టిడిపి గెలుపుకు నిదర్శనం అన్నారు. ఆయన వెంట తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు.
Admin
Namitha News